Apophis : భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఏ రోజున రాబోతుందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apophis : ఆకాశం నుంచి అహ్మదాబాద్ నగరంలోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంత ఆస్టరాయిడ్ భూమి వైపు దూసుకొస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ గ్రహశకలాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని సంస్థ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఇది 2029లో భూమికి అత్యంత సమీపంలోకి వెళుతుందని, ఈ గ్రహశకలం పేరు అపోఫిస్ అని తెలిపారు. మరోవైపు ఈ గ్రహశకలం వల్ల భూమికి ముప్పు వాటిల్లకుండా చేసేందుకు అన్ని దేశాలు ముందుకు వచ్చాయని వాటికి భారత్ పూర్తి సహకారం అందిస్తామని సోమనాథ్ తెలిపారు.
Read Also:Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..
Also Read
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
- IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
- Motichoor Laddu Recipe: మార్కెట్ లడ్డూలు తిని విసిగిపోయారా?.. ఇంట్లోనే మెత్తని మోతీచూర్ లడ్డూ సులువుగా..
- Tilak Varma: వైస్ కెప్టెన్పై పీక్స్లో ఒత్తిడి.. నేడు తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?
అపోఫిస్ గ్రహశకలం భూమికి 32,000 కి.మీ ఎత్తులో వెళుతుందని, అంటే భారత భూస్థిర ఉపగ్రహాల కక్ష్యల కంటే దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇంకా పరిమాణం పరంగా, ఇంత పెద్ద గ్రహశకలం గతంలో భూమికి ఇంత దగ్గరగా వెళ్లలేదని వివరించారు. ఇది భారతదేశపు అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దదని చెబుతారు. ఈ గ్రహశకలం పరిమాణం దాదాపు 340 – 450 మీటర్ల వ్యాసంలో ఉంటుందని చెప్పారు. భూమికి సమీపంలో ఉన్న ఏదైనా గ్రహశకలం వ్యాసంలో 140 మీటర్ల కంటే పెద్దదిగా పరిగణించబడుతుందని సోమనాథ్ చెప్పారు.
Read Also:iPhone Prices Drop: భారీగా తగ్గిన ‘ఐఫోన్’ ధరలు.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
భారీ గ్రహశకలం మానవాళి మనుగడకు ముప్పు అని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో ఇస్రో చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ ‘అపోఫిస్’ అనే గ్రహశకలాన్ని నిశితంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో భూమికి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఈ విషయంలో అన్ని దేశాలకు సహకారం అందిస్తామని సోమనాథ్ తెలిపారు. గ్రహశకలం 300 మీటర్ల కంటే పెద్దదైతే ఖండాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలాలు ఢీకొంటే భూమి నాశనమైపోతుందని తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అపోఫిస్ను మొదటిసారిగా 2004లో గుర్తించారు. ఈజిప్షియన్లు సామ్రాజ్యాల సృష్టికర్తగా విశ్వసించే దేవుడు ‘అపోఫిస్’ పేరు మీద ఈ గ్రహశకలం పేరు పెట్టారు.
తాజావార్తలు
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
MOTOROLA Moto Book 60 Pro: మళ్లీరాని ఆఫర్.. మోటరోలా AI ల్యాప్టాప్.. సగం ధరకే.. OLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!