Ashokgajapathi Raju: భావితరాలకు భారంగా అప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పెరిగిపోతున్న అప్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైనికులు ఆయుధాల్లో కూడా అవినీతి చేశారు. అలాంటి సమయంలో 105 ఎంపీల చేత రాజీనామలు చేయించి కాంగ్రెస్ కి తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారు. రూ.43 వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారు. భావి తరాలపైన కూడా అప్పులు పడే విదంగా వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని విమర్శించారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు.
కర్ఫ్యూకి కారకులైన నాయకులు మాకు నేర్పిస్తారా…మమ్మల్ని భయపెడతారా? మహాత్మా గాంధీ కూడా జైలుకు వెళ్లారు. కానీ ఏ రోజు భయపడలేదు. అన్నగారి పౌరుషంతో బ్రతికారు. అలానే మనం కూడా బ్రతకాలి. స్థానిక ఎమ్మెల్యే మూర్ఖత్వంతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు ఒక వారధి లాంటివారు. తెల్ల దొరలు భయపెట్టినట్టు ప్రతీ విషయంలో వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారు.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండని హెచ్చరిస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. చేసిన పనిలో పెద్దరికం ఉంటుంది. కావున మన ధర్మం ఏంటనేది మనం ఆలోచించుకుని పని చేయాలి. జైల్లో ఉండవలిసిన వాడు బెయిలుపై వచ్చి మన భవిష్యత్ ను, మన పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల్లో గమ్మత్తైన పరిస్థితులను చూస్తున్నాం.
ఎంతో మంది ప్రముఖల స్ఫూర్తితో 40 ఏళ్ల కిందట తెలుగు వాళ్ల కోసం టీడీపీని స్థాపించారు. దేశంలో రాజకీయాల్లో ప్రభావాన్ని తీసుకు వచ్చిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎవరి కంటే తక్కువ కాదని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్లాఘించారు. ఒట్టి మాటలు కట్టిపెట్టు..గట్టి మేలు తలపెట్టవోయ్ .అంటూ గురజాడ మాటలను గుర్తు చేస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేస్తే టీడీపీ కి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?