Asaduddin Owaisi : ఎన్కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్కు పంపండి.. సీఎం యోగిపై ఒవైసీ ఫైర్
- ఎన్కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్కు పంపండి
- భారత్కు బంగారు పతకమైనా వస్తుంది
- సీఎం యోగిపై ఒవైసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహ్రైచ్ ఎన్కౌంటర్పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పెద్ద ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తున్నారని అన్నారు. నాక్ డౌన్ విధానం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్కు పంపపాలని యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ ని దృష్టిలో ఉంచుకుని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీని రాజ్యాంగం ప్రకారం నడపాలని కూడా ఒవైసీ సూచించారు.
READ MORE: Maoists : దండకారణ్యంలో మావోయిస్టు వారోత్సవాలు
Also Read
బహ్రైచ్ హింసాకాండ నిందితులకు పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్పై నిజం తెలుసుకోవడం కష్టం కాదని ఒవైసీ అన్నారు. యోగిజీ ‘థోక్ డెంగే’ విధానం గురించి అందరికీ తెలుసు. పోలీసుల వద్ద ఇంత సాక్ష్యాధారాలు ఉంటే నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా ప్రయత్నాలు జరిగేవి. గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ‘థోక్ దో’ విధానానికి ఇదో ఉదాహరణ. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు పదే పదే చెబుతున్నాం. మీరు యుపీని రాజ్యాంగంతో నడపాలి. తుపాకీలతో కాదు. ఎందుకంటే మీరు ఒక తప్పుని ప్రారంభిస్తే ఆ తప్పులు అలాగే కొనసాగుతాయి. ఎవరైనా ఎవరినైనా ఎంచుకొని కాల్చివేస్తారు.” అని తెలిపారు.
ఇలాంటి ఎన్ కౌంటర్లు చేస్తున్న వారిని ఒలింపిక్స్ కు పంపాలని క్రీడా మంత్రికి చెబుతామని ఒవైసీ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. “కనీసం భారత్కు బంగారు పతకం తీసుకొస్తారు. ఇదంతా హాస్యాస్పదంగా మారింది. బహ్రైచ్లో జరిగిన హింస, దుకాణాలు తగులబెట్టారు. షోరూమ్లు తగులబెట్టారు.. మీరు ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారు. రామ్ గోపాల్ హత్య జరిగింది. ఎవరూ కాదనలేరు.. కానీ ఎవరినైనా కాల్చివేస్తారా?” అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!