Asaduddin Owaisi : ఎన్కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్కు పంపండి.. సీఎం యోగిపై ఒవైసీ ఫైర్
- ఎన్కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్కు పంపండి
- భారత్కు బంగారు పతకమైనా వస్తుంది
- సీఎం యోగిపై ఒవైసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహ్రైచ్ ఎన్కౌంటర్పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పెద్ద ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తున్నారని అన్నారు. నాక్ డౌన్ విధానం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్కౌంటర్ చేసిన వారిని ఒలింపిక్స్కు పంపపాలని యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ ని దృష్టిలో ఉంచుకుని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీని రాజ్యాంగం ప్రకారం నడపాలని కూడా ఒవైసీ సూచించారు.
READ MORE: Maoists : దండకారణ్యంలో మావోయిస్టు వారోత్సవాలు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
బహ్రైచ్ హింసాకాండ నిందితులకు పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్పై నిజం తెలుసుకోవడం కష్టం కాదని ఒవైసీ అన్నారు. యోగిజీ ‘థోక్ డెంగే’ విధానం గురించి అందరికీ తెలుసు. పోలీసుల వద్ద ఇంత సాక్ష్యాధారాలు ఉంటే నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా ప్రయత్నాలు జరిగేవి. గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ‘థోక్ దో’ విధానానికి ఇదో ఉదాహరణ. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు పదే పదే చెబుతున్నాం. మీరు యుపీని రాజ్యాంగంతో నడపాలి. తుపాకీలతో కాదు. ఎందుకంటే మీరు ఒక తప్పుని ప్రారంభిస్తే ఆ తప్పులు అలాగే కొనసాగుతాయి. ఎవరైనా ఎవరినైనా ఎంచుకొని కాల్చివేస్తారు.” అని తెలిపారు.
ఇలాంటి ఎన్ కౌంటర్లు చేస్తున్న వారిని ఒలింపిక్స్ కు పంపాలని క్రీడా మంత్రికి చెబుతామని ఒవైసీ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. “కనీసం భారత్కు బంగారు పతకం తీసుకొస్తారు. ఇదంతా హాస్యాస్పదంగా మారింది. బహ్రైచ్లో జరిగిన హింస, దుకాణాలు తగులబెట్టారు. షోరూమ్లు తగులబెట్టారు.. మీరు ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారు. రామ్ గోపాల్ హత్య జరిగింది. ఎవరూ కాదనలేరు.. కానీ ఎవరినైనా కాల్చివేస్తారా?” అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!