Asaduddin Owaisi: దేశంలో ముస్లింలపై విద్వేష వాతావరణం సృష్టిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్ సభలో అవిశ్వాన తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. భారత దేశంలో బతకాలంటే మోడీకి ఓటేయాల్సిందేనని చెప్పినందుకు కొద్ది రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ ముస్లింలను రైలులో ఎక్కించి చంపేశాడని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read Also: Bhagavanth Kesari: అదేంటి రాజా… హెచ్చరిక లేకుండా బాలయ్యని దించేసావ్
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
నేడు దేశంలో ముస్లింలపై విద్వేష వాతావరణం సృష్టిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మణిపూర్ అల్లర్లపై హోంమంత్రి మాట్లాడారని, అస్సాం రైఫిల్స్పై ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. మణిపూర్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ఆయుధాలు దోచుకుంటున్నారు.. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఓవైసీ ప్రశ్నించారు.
Read Also: PM Kisan Tractor Yojana: కేంద్రం అద్భుత స్కీం.. రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు..!
హిజాబ్పై వివాదం సృష్టిస్తున్నారని, ముస్లిం బాలికలను చదువుకోనివ్వడం లేదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బిల్కిస్ బానో ఈ దేశపు కూతురో కాదో మోడీ ప్రభుత్వం చెప్పాలి, అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో దోషులను ఎందుకు విడుదల చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చైనా సరిహద్దు దాట్టుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఎంఐఎం ఎంపీ ప్రశ్నించారు. చైనా మన భూమిపై కూర్చోలేదా? సమస్య దేశంలో ఉంది, సరిహద్దులో కాదు. కులభూషణ్ జాదవ్ని ఎందుకు వెనక్కి తీసుకురాలేదని ఆయన అడిగారు.
Read Also: Online Shopping: ఆన్లైన్ షాపింగ్ క్రేజ్.. భారీగా పెరిగిన ఇ-కామర్స్ కంపెనీల ఆర్డర్స్
ప్రధాని మోడీ కేవలం జిన్పింగ్ని విమర్శించారు.. కానీ చైనా మన గడ్డపై కూర్చుంటే.. మనం సైన్యాన్ని ఎందుకు అక్కడ నుంచి ఉపసంహరించుకుంటున్నాము అని ఓవైసీ అడిగారు. రాజ్యాంగంలో మనస్సాక్షి స్వేచ్ఛ ప్రస్తావన ఉంది.. కానీ, మోడీ ప్రభుత్వం యూసీసీ తీసుకురావడానికి మొండిగా వ్యవహరిస్తుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రధాని మోడీకి ముస్లింలపై చాలా ప్రేమ ఉంది.. కానీ ఆయన మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు అని ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..