Asaduddin Owaisi: సీఎం కేసీఆర్ను తక్కువ అంచనా వేయద్దు.. ఆయన ముందు ఎవ్వరూ నిలవలేరు
సీఎం కేసీఆర్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశచరిత్రలో తొలిసారి సచివాలయంలో సీఎం కేసీఆర్ మసీద్, మందిర్, చర్చిని నిర్మించారని తెలిపారు. సచివాలయంలో మసీద్, మందిర్, చర్చి అద్భుతంగా కట్టారని కొనియాడారు. అంతేకాకుండా.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని అసదుద్దీన్ పేర్కొ్న్నారు. ఈసారి తమ సీట్లు కూడా పెంచబోతున్నామన్నారు.
Telangana: హృదయవిధారక ఘటన.. తల్లీ బ్రతికించాలని వేడుకున్న కొడుకు..
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
మరోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి రానున్నారని అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సింగిల్ డిజిట్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో బీజేపీకి బలం లేదని అన్నారు. ఈసారి తమ పార్టీ స్థానాలు పెంచుకుంటామని పేర్కొన్నారు. కేసీఆర్ ను తక్కువ అంచనా వేయకూడదని.. అతని రాజకీయ చతురత ముందు ఎవ్వరూ నిలవలేరని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని అభ్యర్థికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని అసద్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గాయన్నారు. దేశంలో కూడా తెలంగాణలాంటి విజన్ కావాలని.. దేశంలో మూడో ఫ్రంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమకు బలం ఉన్న చోట తాము తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా మసీద్ కూల్చితే మళ్లీ కట్టారా..? అని ప్రశ్నించిన ఓవైసీ.. మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తోందన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో మైనార్టీ పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారని పేర్కొన్నారు.
Abhishek Agarwal: దేశ ప్రజలకు, కశ్మీర్ పండిట్లందరికీ రెండు జాతీయ అవార్డులు అంకితం!
ఉదయం తెలంగాణ సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్ తమిళి సైతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మసీదు ప్రారంభంతో పాటు ప్రార్ధనల్లో అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!