Asaduddin Owaisi: సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సవరించిన చట్టం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 14, 25 మరియు 21లను ఉల్లంఘిస్తుంది కాబట్టి విచారణ జరిగే వరకు ఈ చట్టం అమలును నిలిపివేయాలి అని అసదుద్దీన్ కోరారు.
Read Also: Jithender Reddy: హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్ హోదా..!
Also Read
కాగా, భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) 2019 అమలు తర్వాత ప్రారంభమైన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై మరోసారి భారతీయ జనతా పార్టీపై అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రజలందరినీ ప్రభుత్వం ఒకే కోణంలో చూడాలి.. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వకూడదు అంటూ ఒవైసీ పేర్కొన్నారు. సీఏఏ వల్ల దేశంలో విభజన జరుగుతుందని ఆరోపించారు. ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చేయాలనుకునే గాడ్సే ఆలోచనపై ఆధారపడి ఉందన్నారు. పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు.. ఐదేళ్లుగా ఈ నిబంధనలను ఎందుకు పెండింగ్లో ఉంచారో.. ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి? అని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీతో పాటు సీఏఏ ఉద్దేశం కేవలం ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఇతర ప్రయోజనం లేదని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
AIMIM president Asaduddin Owaisi approaches the Supreme Court seeking to stay the implementation of the Citizenship Amendment Act (CAA), 2019 and the Rules, 2024.
Owaisi says no applications seeking grant of citizenship status be entertained or processed by the government under… pic.twitter.com/w8uQii4lyn
— ANI (@ANI) March 16, 2024
- Tags
- AIMIM
- Asaduddin Owaisi
- CAA
- NRC
- PM Modi
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..