Delhi: ఢిల్లీ మంత్రివర్గంలో అనూహ్య మార్పు.. ఆ శాఖలు కూడా అతిషికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర పాలక సంస్థ సేవలు మరియు విజిలెన్స్ విభాగాలను అతిషికి అప్పగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రతిపాదనను పంపినట్లు అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి. ఢిల్లీ సేవల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత ఈ చర్య వచ్చింది. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023 సోమవారం నాడు 131 మంది ఎంపీలు అనుకూలంగా, 102 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఢిల్లీ ఆరోగ్య, నీటి పారుదల శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రస్తుతం సేవలు, విజిలెన్స్ పోర్ట్ఫోలియోలను కలిగి ఉన్నారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్ నుంచి సేవలు, విజిలెన్స్ శాఖలను తప్పించి.. ఆ శాఖలను మంత్రి అతిషికి ఆప్ ప్రభుత్వం అప్పగించింది. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఫైల్ అందినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Also Read: Kiren Rijiju: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
ఢిల్లీ కేబినెట్లోని ఏకైక మహిళా మంత్రి అతిషి ఇప్పుడు 14 పోర్ట్ఫోలియోలను కలిగి ఉంటారు. ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులందరిలో అత్యధిక శాఖలు కలిగిన మంత్రిగా ఆమె నిలిచారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాల తర్వాత సౌరభ్ భరద్వాజ్, అతిషి మార్చిలో మంత్రివర్గంలోకి ప్రవేశించారు. “కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఫైల్ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపడంతో ఆమెకు సేవలు, విజిలెన్స్ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి” అని ఓ ప్రకటన తెలిపింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు గల కారణాలపై ఎలాంటి సమాచారం లేదు.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సక్సేనా ఆమోదం తెలిపిన తర్వాత జూన్ చివరి వారంలో అతిషికి రెవెన్యూ, ప్రణాళిక, ఆర్థిక శాఖల అదనపు బాధ్యతలు అప్పగించారు. జూన్ 1న ఆమెకు ప్రజా సంబంధాల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ నాలుగు శాఖలు గతంలో రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ వద్ద ఉండేవి. అతిషి ప్రస్తుతం పబ్లిక్ వర్క్స్, ఫైనాన్స్, రెవెన్యూ, ప్లానింగ్, మహిళలు, పిల్లల అభివృద్ధి, విద్య, కళ, సంస్కృతి, భాషలు, టూరిజం, పవర్, పబ్లిక్ రిలేషన్స్, ట్రైనింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోలను కలిగి ఉన్నారు. కల్కాజీ ఎమ్మెల్యే అతిషి ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇది 2012లో ఆప్ ఏర్పాటుతో ముగిసింది.
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!