Arunacha Assembly Polls: అరుణాచల్ ప్రదేశ్లో ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunacha Assembly Polls: 60 మంది సభ్యుల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం జూన్ 2తో ముగియనుంది.
2019లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పెమా ఖండూ నేతృత్వంలో బీజేపీ విజేతగా నిలిచింది. ప్రస్తుతం బీజేపీకి అధిక సీట్లు ఉండగా, నేషనల్ పీపుల్స్ పార్టీకి రెండు, కాంగ్రెస్కు ఒకటి, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఇదిలావుండగా, లోక్సభ ఎన్నికల కోసం, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అరుణాచల్ వెస్ట్ నుండి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజును, అరుణాచల్ తూర్పు స్థానం నుంచి తపిర్ గావ్ను పోటీకి దింపింది. మార్చి 2న ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో రిజిజు, గావో పేర్లు ఉన్నాయి. 2019 జాతీయ ఎన్నికలలో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 58.2 శాతం ఓటరు శాతాన్ని సాధించగా, కాంగ్రెస్ 20.69 శాతం ఓటరు శాతాన్ని సాధించింది.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
Read Also: Assembly elections: ఏపీతో పాటు ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే?
ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ, జనతాదళ్ (యునైటెడ్) అరుణాచల్ వెస్ట్ నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ రూహి తగుంగ్ను పోటీకి దింపాలని నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకీ రాష్ట్రంలోని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నైతిక కారణాలను పేర్కొంటూ రాజీనామా చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ పార్టీలకు ఫిరాయించకుండా నిరోధించలేకపోయారు. అలాగే మార్చిలో, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుడు లోంబో తయెంగ్ బీజేపీలో చేరారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్డాంగ్ గత నెలలో బీజేపీలో చేరారు.
అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
మార్చి20వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
మార్చి27వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
మార్చి28వ తేదీ : నామినేషన్ల పరిశీలన
మార్చి30వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
ఏప్రిల్ 19వ తేదీ : అరుణాచల్ ప్రదేశ్ పోలింగ్
జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు
అరుణాచల్లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!