APPSC: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రేపటి నుంచే గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APPSC: నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. రేపటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఆన్ లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ.. రేపటి నుంచి అంటే డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.. మొత్తం 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.. అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 కాగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566గా ఉన్నాయి.. ఇక, 2024 ఫిబ్రవరి 25న గ్రూప్ -2 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు.. అభ్యర్థులు వెబ్ సైట్ https://psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: Vinay Bhaskar: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు..
Also Read
- Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ను ఈ నెల 7వ తేదీన విడుదలైంది. గ్రూప్-II పోస్టులకు నోటిఫికేషన్ లో 897 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ స్థానాలకు అభ్యర్థులను నియమించుకోవడానికి నిర్వహించే వార్షిక పరీక్ష.. ఇది మూడు దశల్లో నిర్వహిస్తారు, మొదటిది ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్ మరియు చివరిగా కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష ఉంటుంది.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సహాయ అభివృద్ధి అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III, పంచాయితీ రాజ్ & గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి.. అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.. దశ 1- ప్రిలిమినరీ పరీక్ష, దశ 2- మెయిన్స్ పరీక్ష, దశ 3- కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష, దశ 4- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షని 2024 ఫిబ్రవరి 25 న నిర్వహించనున్నారు. గ్రూప్ 2 దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేస్తారు.. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి చెందిన వారు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఏపీపీఎస్సీ పేర్కొంది.
తాజావార్తలు
-
Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
-
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
-
Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!