Israel–Hamas war: యూఎన్లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం.. అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం..
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిన్న (సోమవారం) తీర్మానం ఆమోదించబడింది. ఇజ్రాయెల్ శాశ్వత మిత్రదేశమైన అమెరికా ఓటింగ్కు దూరంగా ఉంది. ఓటింగ్కు దూరంగా ఉండాలన్న అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ మండిపడింది. ఈ ప్రతిపాదనను అమెరికా వీటో చేయాలని ఇజ్రాయెల్ కోరింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం UNSCలో కాల్పుల విరమణపై అమెరికా ఒక తీర్మానానికి మద్దతు ఇచ్చింది.. దీంట్లో కాల్పుల విరమణ కోసం బందీలను విడుదల చేసిందన్నారు. రష్యా, చైనాలు కలిసి ఆ ప్రతిపాదనను వీటో చేశాయన్నారు.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ రోజు అల్జీరియాతో కలిసి ఇతర దేశాలు ఈ ప్రతిపాదనను తీసుకురాగా, రష్యా, చైనా కూడా వారితో చేరాయి. అయితే ఈ ప్రతిపాదనలో కేవలం కాల్పుల విరమణ మాత్రమే ప్రస్తావించబడింది. బందీల విడుదలపై చర్చ లేదు అని ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అటువంటి పరిస్థితిలో అమెరికా వీటో అధికారాన్ని ఉపయోగించాలి కదా అన్నారు. పాపం అమెరికా తన విధానాన్ని విడిచిపెట్టి ఓటింగ్కు దూరంగా ఉంది అని పేర్కొన్నారు. వీటోను ఉపయోగించకపోవడంతో అమెరికా మొదటి నుంచి యూఎన్ఎస్సీలో తన స్టాండ్ నుంచి పారిపోవాలనుకుంటుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అంతర్జాతీయ ఒత్తిడితో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించవలసి వస్తుందని హమాస్ ఆశను నేటి ప్రతిపాదన ఇస్తుందని ఇజ్రాయెల్ పేర్కొంది.
Read Also: Temple Fire: అగ్నిప్రమాదంలో పూజారులకు గాయాలు.. హోలీ రంగులే కారణమా..?!
తన ప్రతినిధి బృందాన్ని అమెరికన్ల దగ్గరకు పంపబోనని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఇక, ఇజ్రాయెల్ ఆరోపణలను వాషింగ్టన్ తిరస్కరించింది. యూఎన్ఎస్సీలో తమ విధానాన్ని మార్చుకోలేదని అమెరికా చెప్పింది. రఫా సరిహద్దులో జరుగుతున్న యుద్ధానికి ప్రత్యామ్నాయాలపై చర్చించాలనుకుంటున్నామని యూఎస్ తెలిపింది. మా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు.. గత ఏడాది ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత గాజాలో యుద్ధం అక్టోబర్లో ప్రారంభమైంది. ఇజ్రాయెల్ దాడిలో 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో