Temple Fire: అగ్నిప్రమాదంలో పూజారులకు గాయాలు.. హోలీ రంగులే కారణమా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరం ఆలయంలో బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం సమయంలో బస్మహారతి ఇస్తుండగా.. మంగళహారతి పై రంగులు పొడి పడడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనలో పూజారులతో సహా సేవకులు 14 మంది గాయపడ్డారు. మంటల్లో గాయపడిన వారిని హుటాహుటినా దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కొరకు ఇందోర్ తరలించారు.
also read: Punganur: పుంగనూరులో వైసీపీకి షాక్..!
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ఈ సంఘటనకు సంబంధించి ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. హోలీ పురస్కరించుకొని ఆలయంలోని గర్భగుడి వద్ద బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని.. సాంప్రదాయంలో భాగంగా రంగుల పొడి చల్లుతున్న సమయంలో కర్పూరంపై అది పడటంతో మంట కాస్త నేలపై దొర్లి పెద్ద ఎత్తున ఎగిసినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో గుడిలో పలువురు ప్రముఖులతో పాటు కొందరు భక్తులు కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. కాకపోతే వారు కాస్త దూరంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
also read: Delhi: ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్.. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..
ప్రమాద ఘటన సంబంధించి విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక యంత్రాంగం వారిని కాపాడేందుకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా సోషల్ మీడియా వేదికగా విచారణ వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!