Temple Fire: అగ్నిప్రమాదంలో పూజారులకు గాయాలు.. హోలీ రంగులే కారణమా..?!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరం ఆలయంలో బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం సమయంలో బస్మహారతి ఇస్తుండగా.. మంగళహారతి పై రంగులు పొడి పడడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనలో పూజారులతో సహా సేవకులు 14 మంది గాయపడ్డారు. మంటల్లో గాయపడిన వారిని హుటాహుటినా దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కొరకు ఇందోర్ తరలించారు.
also read: Punganur: పుంగనూరులో వైసీపీకి షాక్..!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ సంఘటనకు సంబంధించి ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. హోలీ పురస్కరించుకొని ఆలయంలోని గర్భగుడి వద్ద బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని.. సాంప్రదాయంలో భాగంగా రంగుల పొడి చల్లుతున్న సమయంలో కర్పూరంపై అది పడటంతో మంట కాస్త నేలపై దొర్లి పెద్ద ఎత్తున ఎగిసినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో గుడిలో పలువురు ప్రముఖులతో పాటు కొందరు భక్తులు కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. కాకపోతే వారు కాస్త దూరంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
also read: Delhi: ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్.. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..
ప్రమాద ఘటన సంబంధించి విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక యంత్రాంగం వారిని కాపాడేందుకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా సోషల్ మీడియా వేదికగా విచారణ వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో