Apple Launches iPad: భారత్లో సరికొత్త చిప్లతో ఐప్యాడ్లను విడుదల చేసిన యాపిల్
- సరికొత్త చిప్లతో ఐప్యాడ్లను భారత్లో విడుదల చేసిన యాపిల్
- శక్తివంతమైన A16 చిప్ను ఉపయోగించి 2025 మోడల్ ఐప్యాడ్ను విడుదల.
- M3 చిప్తో ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్.
Apple Launches iPad: యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఐప్యాడ్లో శక్తివంతమైన A16 చిప్ను ఉపయోగించారు. గత మోడల్స్తో పోలిస్తే, స్టోరేజ్ను కూడా పెంచారు. ఇంతకుముందు 64GB బేస్ మోడల్ ఉంటే, ఇప్పుడు 128GBతో ప్రారంభమవుతుంది. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఫోటోలను, వీడియోలను చాలా క్లారిటీగా, కలర్ఫుల్గా చూపిస్తుంది.
Read Also: Meenakshi Natarajan: పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది తెలుసు
Also Read
ఇక ఇందులో వదిన A16 చిప్ టాబ్లెట్ పనితీరును, పవర్ ఎఫిషియెన్సీని బాగా పెంచుతుంది. పాత మోడల్స్తో పోలిస్తే స్పీడ్ 30 శాతం, ఓవరాల్ పనితీరు 50 శాతం పెరిగినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. మార్కెట్లో ఉన్న టాప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల కంటే ఇది ఆరు రెట్లు వేగవంతంగా ఉంటుంది. A16 చిప్లో 5-కోర్ CPU, 4-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. ఇక ఈ ఐప్యాడ్లో కెమెరా, డిస్ప్లే ఫీచర్ల విషయానికి వస్తే.. వెనుక వైపు 12MP కెమెరా ఉంది. ముందు వైపు 12MP వైడ్ యాంగిల్ లెన్స్తో సెంటర్ స్టేజ్ ఫీచర్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్స్లో కదులుతున్నా, ఫోకస్లో ఉంచుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 128GB రూ.34,900, 256GB రూ.44,900, 512GB రూ.64,900గా ఉన్నాయి. సెల్యులార్ మోడల్ 128GB ధర రూ.49,900. మార్చి 12వ తేదీ నుంచి యాపిల్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఇక మరోవైపు, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్ను కూడా విడుదల చేసింది. ఇది M3 చిప్తో వస్తోంది. దీనిని రెండు సైజుల్లో (11 అంగుళాలు, 13 అంగుళాలు) విడుదల చేసారు. M3 చిప్లో 8-కోర్ CPU, 9-కోర్ GPU ఉండడంతో అవి.. CPU పనితీరును 35%, గ్రాఫిక్స్ 40% మెరుగుపరుస్తుందని ఆపిల్ పేర్కొంది. ఈ టాబ్లెట్ యాపిల్ ఇంటెలిజెన్స్ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ పనుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. మ్యాజిక్ కీబోర్డ్, యాపిల్ పెన్సిల్ (USB-C, ప్రో) వంటి యాక్సెసరీస్ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Read Also: Dharmapuri Arvind: ట్రంప్ మోడీని కుర్చీలో దగ్గరుండి కూర్చోపెడుతున్నారు.. రేవంత్ ఓ లెక్కా!
ఇక దీని ధర విషయానికి వస్తే.. 11 అంగుళాల వై-ఫై మోడల్ (128GB) ధర రూ.59,900 కాగా.. 11 అంగుళాల వై-ఫై + సెల్యులార్ (128GB) మోడల్ ధర రూ.74,900. అలాగే13 అంగుళాల వై-ఫై మోడల్ రూ.79,900. ఇంకా 13 అంగుళాల సెల్యులార్ మోడల్ రూ.94,900 గా ఆపిల్ నిర్ణయించింది. మార్చి 12 నుంచి యాపిల్ అధికారిక వెబ్సైట్, స్టోర్లలో లభిస్తుంది. మొత్తం మీద కొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ రెండు టాబ్లెట్లు శక్తివంతమైన చిప్సెట్లు, మెరుగైన డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్తో వచ్చాయి. ప్రొఫెషనల్స్, గేమర్స్, సాధారణ వినియోగదారులకు ఇవి మంచి ఛాయిస్ అవుతాయి.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో