Apple Launches iPad: భారత్లో సరికొత్త చిప్లతో ఐప్యాడ్లను విడుదల చేసిన యాపిల్
- సరికొత్త చిప్లతో ఐప్యాడ్లను భారత్లో విడుదల చేసిన యాపిల్
- శక్తివంతమైన A16 చిప్ను ఉపయోగించి 2025 మోడల్ ఐప్యాడ్ను విడుదల.
- M3 చిప్తో ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Launches iPad: యాపిల్ కంపెనీ తాజాగా 2025 మోడల్ ఐప్యాడ్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఐప్యాడ్లో శక్తివంతమైన A16 చిప్ను ఉపయోగించారు. గత మోడల్స్తో పోలిస్తే, స్టోరేజ్ను కూడా పెంచారు. ఇంతకుముందు 64GB బేస్ మోడల్ ఉంటే, ఇప్పుడు 128GBతో ప్రారంభమవుతుంది. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఫోటోలను, వీడియోలను చాలా క్లారిటీగా, కలర్ఫుల్గా చూపిస్తుంది.
Read Also: Meenakshi Natarajan: పని చేస్తుంది ఎవరు.. యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది తెలుసు
Also Read
ఇక ఇందులో వదిన A16 చిప్ టాబ్లెట్ పనితీరును, పవర్ ఎఫిషియెన్సీని బాగా పెంచుతుంది. పాత మోడల్స్తో పోలిస్తే స్పీడ్ 30 శాతం, ఓవరాల్ పనితీరు 50 శాతం పెరిగినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. మార్కెట్లో ఉన్న టాప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ల కంటే ఇది ఆరు రెట్లు వేగవంతంగా ఉంటుంది. A16 చిప్లో 5-కోర్ CPU, 4-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజన్ ఉన్నాయి. ఇక ఈ ఐప్యాడ్లో కెమెరా, డిస్ప్లే ఫీచర్ల విషయానికి వస్తే.. వెనుక వైపు 12MP కెమెరా ఉంది. ముందు వైపు 12MP వైడ్ యాంగిల్ లెన్స్తో సెంటర్ స్టేజ్ ఫీచర్ సపోర్ట్ ఉంటుంది. వీడియో కాల్స్లో కదులుతున్నా, ఫోకస్లో ఉంచుతుంది. ఇక ధరల విషయానికి వస్తే.. 128GB రూ.34,900, 256GB రూ.44,900, 512GB రూ.64,900గా ఉన్నాయి. సెల్యులార్ మోడల్ 128GB ధర రూ.49,900. మార్చి 12వ తేదీ నుంచి యాపిల్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఇక మరోవైపు, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 7వ తరం (జెనరేషన్) టాబ్లెట్ను కూడా విడుదల చేసింది. ఇది M3 చిప్తో వస్తోంది. దీనిని రెండు సైజుల్లో (11 అంగుళాలు, 13 అంగుళాలు) విడుదల చేసారు. M3 చిప్లో 8-కోర్ CPU, 9-కోర్ GPU ఉండడంతో అవి.. CPU పనితీరును 35%, గ్రాఫిక్స్ 40% మెరుగుపరుస్తుందని ఆపిల్ పేర్కొంది. ఈ టాబ్లెట్ యాపిల్ ఇంటెలిజెన్స్ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ పనుల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. మ్యాజిక్ కీబోర్డ్, యాపిల్ పెన్సిల్ (USB-C, ప్రో) వంటి యాక్సెసరీస్ను కూడా సపోర్ట్ చేస్తుంది.
Read Also: Dharmapuri Arvind: ట్రంప్ మోడీని కుర్చీలో దగ్గరుండి కూర్చోపెడుతున్నారు.. రేవంత్ ఓ లెక్కా!
ఇక దీని ధర విషయానికి వస్తే.. 11 అంగుళాల వై-ఫై మోడల్ (128GB) ధర రూ.59,900 కాగా.. 11 అంగుళాల వై-ఫై + సెల్యులార్ (128GB) మోడల్ ధర రూ.74,900. అలాగే13 అంగుళాల వై-ఫై మోడల్ రూ.79,900. ఇంకా 13 అంగుళాల సెల్యులార్ మోడల్ రూ.94,900 గా ఆపిల్ నిర్ణయించింది. మార్చి 12 నుంచి యాపిల్ అధికారిక వెబ్సైట్, స్టోర్లలో లభిస్తుంది. మొత్తం మీద కొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్ రెండు టాబ్లెట్లు శక్తివంతమైన చిప్సెట్లు, మెరుగైన డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్తో వచ్చాయి. ప్రొఫెషనల్స్, గేమర్స్, సాధారణ వినియోగదారులకు ఇవి మంచి ఛాయిస్ అవుతాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..