Food Adulteration: కుల్సుంపురాలో ఫుడ్ స్కాం బట్టబయలు.. కుళ్లిన పదార్థాలతో భారీగా సమోసాలు తయారీ..!
- హైదరాబాద్ కుల్సుంపురాలో భారీ ఫుడ్ స్కాం బట్టబయలు
- కుళ్లిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారీ
- ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు
- అబ్దుల్ రషీద్ (73) అరెస్ట్, రిమాండ్కు తరలింపు
- H-FAST, టాస్క్ఫోర్స్, పోలీసులు సంయుక్త దాడులు
- రూ.5 లక్షల విలువైన నాసిరకం పదార్థాల స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Adulteration: హైదరాబాద్ లోని కుల్సుంపురా ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా కుళ్లిపోయిన గుడ్లతో ఎగ్ పఫ్స్ తయారు చేసి హోటళ్లకు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు దాడులు నిర్వహించారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో పాడైన, నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. HFAST అధికారులు కేసు నమోదు చేసి అబ్దుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో కుల్సుంపురా ప్రాంతంలో తయారవుతున్న ఫుడ్ ఐటమ్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండలని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారవుతున్న ఆహారం కనపడుతుంది. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలేన్స్ టీం (H-FAST), టాస్క్ఫోర్స్ సిబ్బంది, కులసుంపుర పోలీస్ సమన్వయంతో ఈ దాడి చేపట్టారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ దాడిలో 73 ఏళ్ల అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా సమోసాల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అతనికి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSAI) లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఏదీ లేకపోవడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా కుళ్లిపోయిన గుడ్లు, పలుమార్లు వాడిన వంటనూనె వంటి నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ యూనిట్లో అపరిశుభ్ర పరిస్థితుల్లో సమోసాలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
South Korea: డేజియోన్ కారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 59కి తీవ్రగాయాలు
దాడి సమయంలో సుమారు రూ.5 లక్షల విలువైన నాసిరకం ఆహార పదార్థాలు, ముడి సరుకులు, యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వివిధ రకాల సమోసాలు, మైదా, స్వీట్ కార్న్ వంటి ముడి పదార్థాలు కూడా ఉన్నాయి. నిందితుడు అబ్దుల్ రషీద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. హోటళ్లకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
An illegal food manufacturing unit engaged in the large-scale preparation of samosas under grossly unhygienic conditions was successfully busted by the Hyderabad Food Adulteration Surveillance Team (H-FAST) of the Task Force, in coordination with Kulsumpura Police, on 20.03.2026… pic.twitter.com/NnOHOyq56d
— Hyderabad City Police (@hydcitypolice) March 21, 2026
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!