VI And BSNL: ఒకే గొడుగు కిందకు వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్..
- భారతీయ టెలికాం రంగంలో పెను మార్పులు..
- ఒక్కటి కానున్న వొడాఫోన్ ఐడియా అండ్ బీఎస్ఎన్ఎల్..
- VIలో 49 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ టెలికాం రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతూ.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) , ప్రైవేట్ రంగంలోని వొడాఫోన్ ఐడియా (Vi) చేతులు కలపనున్నాయి. తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ రెండు సంస్థలు.. మార్కెట్లో తమ ఉనికిని చాటుకోవడానికి ఒకరి వనరులను మరొకరు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు తమ వద్ద ఉన్న టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ , స్పెక్ట్రమ్ను పంచుకోనున్నాయి. దీనివల్ల కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసే ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ ‘కాస్ట్ సేవింగ్’ పద్ధతి రెండు కంపెనీలకు ఊపిరి పోయనుంది. ముఖ్యంగా నెట్వర్క్ విస్తరణకు అవసరమైన మూలధన వ్యయం తగ్గడం వల్ల, ఆ నిధులను సేవల నాణ్యత పెంచడానికి కేటాయించే అవకాశం ఉంటుంది.
Also Read
- Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
- WhatsApp Shutdown ALERT: అలర్ట్.. ఆ తేదీ నుండి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ ఇదే
- Honor Play 80 Plus: హానర్ ప్లే 80 ప్లస్ విడుదల.. 7,500mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్
- Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
Also Read:TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన కోటా టికెట్లు విడుదల..
బీఎస్ఎన్ఎల్కు కుగ్రామాల్లో ఉన్న పటిష్టమైన నెట్వర్క్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా పట్టణాల్లో Vi టెక్నాలజీ బీఎస్ఎన్ఎల్ కు తోడ్పడుతుంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవల్లో దూసుకుపోతుండగా.. వెనుకబడిన Vi , బీఎస్ఎన్ఎల్ లు ఈ భాగస్వామ్యంతో 5జీ నెట్వర్క్ను వేగంగా నిర్మించే అవకాశం ఉంది. దీని వల్ల టెలికాం రంగం కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పోటీ పెరగడం వల్ల కాల్ రేట్లు, డేటా ప్యాక్ల ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియాలో 49 శాతం వాటాను కలిగి ఉంది. అంటే ఒక రకంగా Vi కూడా ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణలోనే నడుస్తోంది. అటు పూర్తి ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు, ఇటు ప్రభుత్వం వాటా ఉన్న Vi కి మధ్య సమన్వయం కుదరడం వల్ల టెలికాం రంగంలో ప్రభుత్వ ప్రాబల్యం పెరగనుంది. ప్రస్తుతం రెండు సంస్థలు 4జీ సైట్ల అప్గ్రేడేషన్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ కీలక సమయంలో ఇరు సంస్థలు ఏకమవ్వడం వల్ల టెక్నికల్ లోపాలు తగ్గి, కాల్ డ్రాప్స్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!