Rains in AP for three days Due to Low pressure in Bay of Bengal: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని చెప్పారు.
ఇది డిసెంబర్ 1వ వరకు తుఫాన్గా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఆపై ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని.. 4వ తేదీకల్లా తీవ్ర తుఫాన్గా బలపడుతుందట. ఇక 5వ తేదీకల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫాన్గా తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్ బలహీనపడుతుందని పేర్కొన్నారు.
Also Read: Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.