AP SSC 10th Results 2024: టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత.. బాలికలదే పై చేయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP SSC 10th Results 2024: ఏపీ టెన్త్ 2023-24 ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు.. ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్ధి వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు అన్నారు. ఇక, ఈ ఏడాది 6,16,615 మంది పరీక్షలు రాశారు.. 16 లక్షల్లో 86.69 శాతం విద్యార్థులు.. అంటే 5,34,578 మంది ఉత్తీర్ణులు అయినట్టు వెల్లడించారు.. ఇక, వీరిలో బాలురు 83.21 శాతం, బాలికలు 89.17 శాతం పాస్ అయ్యారని తెలిపారు.. 17 స్కూళ్లలో మాత్రమే ఒక్కరూ పాస్కాలేదన్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితం ఒక ప్రామాణికంగా పేర్కొన్నారు సురేష్ కుమార్.. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ జరగకూడదని 6 నెలల పాటు పని చేసి పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.. 45 వేల మంది సిబ్బంది ఈ పరీక్ష నిర్వహణలో ఉన్నారు.. 20 వేల మంది వాల్యుయేషన్ లో పాల్గొన్నారని తెలిపారు. ఇక, మన్యం జిల్లా మొదటి స్ధానంలో ఉండగా.. కర్నూలు జిల్లా చివరి స్ధానంలో ఉందన్నారు. మన్యం జిల్లాలో 96.37 శాతం మంది విద్యార్థులు పాస్ అయితే.. కర్నూలు జిల్లాలో కేవలం 62.47 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారన్నారు. మరోవైపు.. తెలుగు మీడియంలో ఉత్తీర్ణత 71.08 శాతంగా ఉంటే.. ఇంగ్లీష్ మీడియంలో 92.32 శాతం ఉత్తీర్ణత ఉందని.. అదే హిందీ మీడియంలో 100 శాతం ఉత్తీర్ణులు అయినట్టు వివరించారు.
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
రాష్ట్రంలోని 2803 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.. 17 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇందులో ప్రభూత్వ స్కూల్ ఒకటి మాత్రమే ఉంది.. 69.26 శాతం మంది మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఇక, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్.. నాలుగు రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన మార్క్స్ మెమో ఆన్ లైన్లో ఉంటుందని పేర్కొన్నారు. మైగ్రేషన్ కు అప్లై చేసిన వారికి కూడా ఆన్ లైన్ లోనే ఇవ్వడం జరుగుతుందన్నారు.
విద్యార్ధులకు పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ (PEN) ఉండాలి.. ఈ నంబరుతో విద్యార్ధి వివరాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది.. పర్మనెంటు నంబరుతోనే అన్ని వివరాలు ఉంటాయి.. ఈ విద్యా సంవత్సరం నుంచీ PENను అమలులోకి తెస్తున్నాం అన్నారు. దేశంలోనే PEN ను అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు. ఎవరి సహాయం లేకుండా కంప్యూటర్ ద్వారా దివ్యాంగులు 13 మంది కర్నూలులో పరీక్ష రాశారు.. వారందరూ పాస్ అయ్యారని వెల్లడించారు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్..
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!