Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..
- రైతులకు శుభవార్త..
- 1.12 కోట్ల పట్టా పుస్తకాలు..
- మార్చి 2027 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ సమీక్షా సమావేశంలో వెలువడిన ప్రధానాంశాలు ఇవే..
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
1. పాస్ పుస్తకాల పంపిణీకి గడువు..
రాష్ట్రవ్యాప్తంగా భూ యజమానులకు భద్రత కల్పించేలా 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. దీనివల్ల రైతులకు తమ భూములపై పూర్తిస్థాయి భరోసా లభిస్తుంది.
2. ఇనాం భూములకు విముక్తి..
ఏళ్ల తరబడి వివాదాల్లో ఉన్న విలేజ్ సర్వీస్ ఇనాం భూములకు సంబంధించి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. సుమారు 1.37 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా (22A) నుండి తొలగించనున్నారు. అంతేకాకుండా, ఇతర సర్వీస్ ఇనాంల కింద ఉన్న మరో లక్ష ఎకరాల భూములకు కూడా విముక్తి కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల వేలాది మంది రైతులకు తమ భూములపై క్రయవిక్రయాల హక్కులు లభిస్తాయి.
3. పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్..
2016 కంటే ముందు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద పట్టాలు పొంది, ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి ఇంటికీ అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల పేదలకు ఆస్తి హక్కు లభించడమే కాకుండా, భవిష్యత్తులో ఆ ఆస్తిపై బ్యాంక్ రుణాలు పొందే అవకాశం కూడా కలుగుతుంది.
మొత్తంగా.. ఈ నిర్ణయాలు భూ వివాదాలను తగ్గించడంతో పాటు, సామాన్య, పేద వర్గాల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయనున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్దేశిత గడువులోగా ఈ పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!