Minister Atchannaidu: టీడీపీ గతంలో చాలా కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొందని, నిద్ర లేని రాత్రులు గడిపామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ నేతలు మాట్లాడలేకపోయేవారని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సభ నుంచి హామీ ఇస్తున్నాం.. దేశంలో అగ్రగామిగా చంద్రబాబు రాష్ర్టాన్ని నిలబెడతారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తన శాఖ జిల్లా ప్రజలకు ఉపయోగపడే శాఖ అని మంత్రి తెలిపారు. తాను చాలా అధృష్టవంతుడినని, అచ్చెన్నాయుడు సమర్ధతను చంద్రబాబు గుర్తించి కీలక శాఖలు ఇచ్చారన్నారు.
Read Also: Rammohan Naidu: భోగాపురం ఎయిర్పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాం..
ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని.. తన జీవితం శ్రీకాకుళం జిల్లాకు , టీడీపీకీ, చంద్రబాబు కుటుంబానికి అంకితం చేస్తున్నానని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి అంటే అచ్చెన్నాయుడిలా ఉండాలనుకునే విధంగా పనిచేస్తానన్నారు. తమ్మినేని, ధర్మాన లాంటి రాజకీయ ఉద్దండులు ఉండి ఆముదాలవలస రోడ్డు వేయలేకపోయారని విమర్శించారు. మేం హామీ ఇస్తున్నాం, కోడి రామ్మూర్తి స్టేడియం, రోడ్లు సహా ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. కార్యకర్తలకు అన్యాయం చేయమన్నారు. చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఒక కుటుంబానికి రెండు పదవులు వచ్చాయని.. ఒక నమ్మకంతో చంద్రబాబు పదవి ఇచ్చారన్నారు. అచ్చెన్నాయుడు మాట ఇస్తే పీక కోసుకుంటాడు తప్ప మాట తప్పడున్నారు.