Minister Adimulapu Suresh: గ్రాఫిక్స్ చూపించటం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Adimulapu Suresh: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్ది మాత్రమేనని ఆయన అన్నారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు యుద్దం ప్రకటించాననటం హాస్యాస్పదమన్నారు.
Also Read: CS Jawahar Reddy: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ సమీక్ష
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
రైతులను మోసం చేసిన రైతు ద్రోహి చంద్రబాబు అంటూ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. రెండు టన్నెల్స్ త్వరలో ప్రారంభిస్తామని.. ప్రాజెక్టు నిర్వాసితులకు సమస్యలు పరిష్కరించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ప్రకాశం జిల్లాకు ఏమి చేశారో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజలు సీఎం జగన్ పక్షానే ఉన్నారని ఆయన పేర్కొ్న్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు ఎన్ని వైపుల నుంచి తిరిగినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
Also Read: Rahul Gandhi: మళ్లీ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన రాహుల్.. ట్విట్టర్ బయోలో మార్పు
గ్రాఫిక్స్ చూపించటం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలపై దాడి చేసి అలజడి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. డ్రోన్ కెమెరాల్లో వ్యూల కోసం ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డికి ప్రజల్లో ఉన్న జనాధరణను చూసి ఓర్వలేకనే పుంగనూరు ఘటనకు చంద్రబాబు పూనుకున్నారని ఆదిమూలపు సురేష్ అన్నారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!