AP High Court: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం.. హైకోర్టులో ఎవరి వాదన ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఎన్నికల ఫలితాల ముందు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, హైకోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది తెలింది ఏపీ హైకోర్టు.. దీంతో.. రేపు సాయంత్రం ఎలాంటి తీర్పు రానుంది అనేది ఉత్కంఠగా మారింది..
ఇక, హైకోర్టులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనల విషయానికి వస్తే.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు చట్ట బద్దత లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. ఏపీలో మాత్రమే ECI ఆదేశాలు అమలు చేయటం దారుణమని.. ఈ ఆదేశాలు వల్ల పోస్టల్ బ్యాలెట్ అంశంలో అనవసర అపోహలు తలెత్తే అవకాశం ఉందని హైకోర్టులో తమ వాదనలు వినిపించింది వైసీపీ.
Also Read
- బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
- India Lowest T20I Scores: 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. చరిత్రలో భారత్ సాధించిన అత్యల్ప స్కోర్లు ఇవే.!
మరోవైపు.. చట్టానికి లోబడి మాత్రమే ఈ ఆదేశాలు ఇచ్చాము అని హైకోర్టులో వాదించింది ఈసీఐ.. మొదటిసారిగా అసిస్టెంగ్ అధికారులను మేమే నియమించాం.. పేరు, సీల్, డిసిగ్నేశన్ వంటివి ఏమీ లేకపోయినా ఇబ్బంది లేదని పేర్కొంది. ఏపీలో అభ్యంతరం వ్యక్తం చేశారు.. కాబట్టి ఈసీ నుంచి స్పష్టత ఇస్తున్నాం.. ఇది అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తుంది.. ఫెసిలిటెట్ సెంటర్లు ఏర్పాటు చేసిందే ఈసీ అయినప్పుడు ఇబ్బంది ఏం ఉంటుంది? అని ప్రశ్నించింది. ఈసీ నియమించిన సెంటర్లో అధికారులు సంతకం చేస్తే పోస్టల్ బ్యాలెట్ వ్యాలీడ్ అవుతుందని హైకోర్టులో వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్.
ఇక, ఇంప్లిడ్ పిటిషన్ లో టీడీపీ వాదనలు వినిపిస్తూ.. ECI ఆదేశాలకు చట్టబద్ధత ఉందని పేర్కొంది.. అనేక విషయాల్లో గతంలో ఈసీ వెసులుబాటు ఇచ్చింది.. ఇదే మొదటిసారి కాదు అని గుర్తుచేసింది.. పోలింగ్ అధికారులు చేసిన తప్పులకి ఓటర్లను బాధ్యులను చేయటం సరికాదు అని తమ వాదనలు వినిపించింది టీడీపీ.. ఇక, అన్ని వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పు రేపు సాయంత్రం 6 గంటలకు ఇస్తామంటూ.. తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో.. రేపు ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీలో హైకోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
West Bengal: “వాడికి ఇదే సరైన శిక్ష”.. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Dhanush: ధనుష్ నెక్స్ట్ మూవీ ఏలియన్ సైన్స్ ఫిక్షనా? ఫ్యాన్స్కు జూలై 10న పండగే!
-
Samsung Galaxy Unpacked 2026: సామ్ సంగ్ ఫోల్డబుల్ 5G ఫోన్లు, గెలాక్సీ వాచ్ 9, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ డేట్ ఫిక్స్..!
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!