AP Highcourt : ఏపీ హైకోర్టు మార్పుపై పార్లమెంట్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అభ్యర్థన వచ్చిందా? అలా అయితే, దాని వివరాలు మరియు ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిస్పందన ఏమిటి? అని వైఎస్సార్ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించగా.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఫిబ్రవరి, 2020లో హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చాలని ప్రతిపాదించారు. హైకోర్టు బదిలీ పై సంబంధిత హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర హైకోర్టు నిర్వహణకు అయ్యే ఖర్చును భరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Also Read : Taapsee: మీడియాకు అందుకే దూరంగా ఉన్నా..!
Also Read
అదే విధంగా, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ పరిపాలనను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు. హైకోర్టును కర్నూలుకు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండూ తమ అభిప్రాయాన్ని రూపొందించి, పూర్తి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెండింగ్లో లేదు.’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానం ఇచ్చారు.
Also Read : Manipur: మణిపూర్కు డీఐజీ స్థాయి అధికారులు.. పొరుగు రాష్ట్రాల నుంచి పంపిన కేంద్రం
ఇదిలా ఉంటే.. నిన్న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన భవనంలో మణిపూర్ ఉదంతం కుదిపేసింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై ఉభయ సభలు హోరెత్తాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేయడంపై ప్రతిపక్షాలు గట్టిగా గళమెత్తాయి. చర్చ జరగాల్సిందేనని.. ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్పై సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో గురువారం వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఉభయ సభలు స్తంభించిపోయాయి.
తాజావార్తలు
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
-
Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్కు కొత్త కెప్టెన్..
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!