AP Highcourt : ఏపీ హైకోర్టు మార్పుపై పార్లమెంట్లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అభ్యర్థన వచ్చిందా? అలా అయితే, దాని వివరాలు మరియు ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిస్పందన ఏమిటి? అని వైఎస్సార్ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించగా.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఫిబ్రవరి, 2020లో హైకోర్టును అమరావతి నుండి కర్నూలుకు మార్చాలని ప్రతిపాదించారు. హైకోర్టు బదిలీ పై సంబంధిత హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర హైకోర్టు నిర్వహణకు అయ్యే ఖర్చును భరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Also Read : Taapsee: మీడియాకు అందుకే దూరంగా ఉన్నా..!
Also Read
అదే విధంగా, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ పరిపాలనను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటారు. హైకోర్టును కర్నూలుకు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండూ తమ అభిప్రాయాన్ని రూపొందించి, పూర్తి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెండింగ్లో లేదు.’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానం ఇచ్చారు.
Also Read : Manipur: మణిపూర్కు డీఐజీ స్థాయి అధికారులు.. పొరుగు రాష్ట్రాల నుంచి పంపిన కేంద్రం
ఇదిలా ఉంటే.. నిన్న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన భవనంలో మణిపూర్ ఉదంతం కుదిపేసింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై ఉభయ సభలు హోరెత్తాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేయడంపై ప్రతిపక్షాలు గట్టిగా గళమెత్తాయి. చర్చ జరగాల్సిందేనని.. ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్పై సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో గురువారం వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఉభయ సభలు స్తంభించిపోయాయి.
తాజావార్తలు
-
Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
-
Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
-
NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్కు సీఎం చంద్రబాబు, లోకేష్!
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
-
Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!