NTV Telugu Site icon

Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఇ-పంట, ఈ కేవై సీ ద్వారా రైతులు, కౌలు రైతు వివరాలతో ధాన్యం కొనుగోళ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆధార్ అనుసంధానంతో ఇ-పంట , ఇ-కేవై సీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేయాలని ప్రభుత్వ ఆదేశించింది.

Read Also: AP CM Chandrababu: తొలిసారి ఆర్టీజీఎస్ విభాగానికి సీఎం చంద్రబాబు

ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలు రాష్ట్రస్థాయి ధాన్యం కొనుగోళ్లకు నోడల్ సంస్థలుగా పనిచేస్తాయని స్పష్టం చేస్తూ జీవో జారీ చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ లో నమోదు కావాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300 , గ్రేడ్ ఏ రకానికి రూ.2320 క్వింటాలుకు చెల్లించాలని స్పష్టం చేసింది. 2024-25 ఖరీఫ్ సీజన్ కు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సర్కార్ స్పష్టం చేసింది. సేకరణ సహా, మిల్లింగ్ ఆపరేషన్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.