AP Amaravti Jac : జీపీఎఫ్పై వడ్డీ ఆర్ధిక శాఖ కార్యదర్శి జీతం నుంచి చెల్లించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీపీఎఫ్ విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఆహ్వానం లేకుండా జీఓఎం సమావేశం నిర్వహించారని, హైకోర్టు ఉత్తర్వులతో మాకు ఇటీవల జరిగిన సమావేశానికి పిలిచారన్నారు. ఏప్రిల్ లో జీపీఎఫ్ సొమ్ము మా ఖాతాలలో వేసేసామని ఆర్ధిక శాఖ కార్యదర్శి చెప్పారని, మేం ప్రశ్నిస్తే మరోసారి చూసుకుని చెపుతానని ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ చెప్పారన్నారు. మూడు నెలల కు మించి చెల్లించని జీపీఎఫ్ పై వడ్డీ ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ జీతం నుంచీ చెల్లించాలని మా డిమాండ్ చేశారు. జీపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ జరగకపోవడంతో ఆ సొమ్ము 13 వేల కోట్లు ఉంటుందని మా సంఘం భావిస్తోందని, మా జిపీఎఫ్ ఏ ప్రభుత్వం వచ్చినా వేరేలా వినియోగించకుండా డిపాజిట్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. బ్రిటీషు నాటి జీపీఎఫ్ చట్టం కొన్ని మార్పులతో ఇప్పటికీ అమలులో ఉందని, డీటీఏ నివేదిక ఇచ్చారా.. ఇస్తే.. ఆ నివేదికలో ఏముందో ప్రభుత్వం చెప్పాలన్నారు.
Also Read : Recovering From Depression: డిప్రెషన్ నుండి ఉపశమనం ఎలా ?
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
‘486 కోట్ల జీపీఎఫ్ ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసిందని కేంద్ర ఆర్ధికమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. జీపీఎఫ్ అక్రమ విత్ డ్రా పై ఎవరి మీద కంప్లైంట్ చేయాలో అనే సందిగ్ధత నెలకొంది. నిన్న జరిగిన సమావేశానికి మమ్మల్ని పిలవలేదు. అనధికారిక సమావేశం అని ప్రకటించడం.. మమ్మల్ని పిలవకపోవడానికి కారణంగా భావిస్తాం. మంత్రి పిలిచిన సంఘాలకు ఏ విధమైన చట్టబద్ధత ఉంది. ఏ నిబంధనల ప్రకారం ఆ సంఘాలను ఫెడరేషన్ చేసి సమావేశాలకు పిలిచారో ప్రభుత్వం చెప్పాలి. హక్కును మీ దయ కాదు అనడం మా విధానం. మా విధానం సామరస్య ధోరణి కాదు అని ప్రభుత్వం భావిస్తోందా. బొప్పరాజు ఆధ్వర్యంలో కొన్ని అందోళనలు జరిగాయి..అది ఉద్యమంగా మేం భావిస్తాం. మరే సంఘాలూ ఉద్యమం చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరఫున ఉద్యోగులున్నారో ఓటింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. ఉద్యోగులు నిర్ణయించిన సంఘం ఏదైనా ఆ సంఘం తరఫున మేం పని చేయడానికి సిద్ధం. ఈనెల 30న రాజమండ్రిలో రాష్ట్ర స్ధాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Andrea Jeremiah : ‘సైంధవ్ ’తో యాక్షన్లో జాస్మిన్.. గన్నుతో మామూలుగా లేదు
తాజావార్తలు
-
Peddi సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ..
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!