AP Amaravti Jac : జీపీఎఫ్పై వడ్డీ ఆర్ధిక శాఖ కార్యదర్శి జీతం నుంచి చెల్లించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీపీఎఫ్ విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఆహ్వానం లేకుండా జీఓఎం సమావేశం నిర్వహించారని, హైకోర్టు ఉత్తర్వులతో మాకు ఇటీవల జరిగిన సమావేశానికి పిలిచారన్నారు. ఏప్రిల్ లో జీపీఎఫ్ సొమ్ము మా ఖాతాలలో వేసేసామని ఆర్ధిక శాఖ కార్యదర్శి చెప్పారని, మేం ప్రశ్నిస్తే మరోసారి చూసుకుని చెపుతానని ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ చెప్పారన్నారు. మూడు నెలల కు మించి చెల్లించని జీపీఎఫ్ పై వడ్డీ ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ జీతం నుంచీ చెల్లించాలని మా డిమాండ్ చేశారు. జీపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ జరగకపోవడంతో ఆ సొమ్ము 13 వేల కోట్లు ఉంటుందని మా సంఘం భావిస్తోందని, మా జిపీఎఫ్ ఏ ప్రభుత్వం వచ్చినా వేరేలా వినియోగించకుండా డిపాజిట్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. బ్రిటీషు నాటి జీపీఎఫ్ చట్టం కొన్ని మార్పులతో ఇప్పటికీ అమలులో ఉందని, డీటీఏ నివేదిక ఇచ్చారా.. ఇస్తే.. ఆ నివేదికలో ఏముందో ప్రభుత్వం చెప్పాలన్నారు.
Also Read : Recovering From Depression: డిప్రెషన్ నుండి ఉపశమనం ఎలా ?
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
‘486 కోట్ల జీపీఎఫ్ ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసిందని కేంద్ర ఆర్ధికమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. జీపీఎఫ్ అక్రమ విత్ డ్రా పై ఎవరి మీద కంప్లైంట్ చేయాలో అనే సందిగ్ధత నెలకొంది. నిన్న జరిగిన సమావేశానికి మమ్మల్ని పిలవలేదు. అనధికారిక సమావేశం అని ప్రకటించడం.. మమ్మల్ని పిలవకపోవడానికి కారణంగా భావిస్తాం. మంత్రి పిలిచిన సంఘాలకు ఏ విధమైన చట్టబద్ధత ఉంది. ఏ నిబంధనల ప్రకారం ఆ సంఘాలను ఫెడరేషన్ చేసి సమావేశాలకు పిలిచారో ప్రభుత్వం చెప్పాలి. హక్కును మీ దయ కాదు అనడం మా విధానం. మా విధానం సామరస్య ధోరణి కాదు అని ప్రభుత్వం భావిస్తోందా. బొప్పరాజు ఆధ్వర్యంలో కొన్ని అందోళనలు జరిగాయి..అది ఉద్యమంగా మేం భావిస్తాం. మరే సంఘాలూ ఉద్యమం చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరఫున ఉద్యోగులున్నారో ఓటింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. ఉద్యోగులు నిర్ణయించిన సంఘం ఏదైనా ఆ సంఘం తరఫున మేం పని చేయడానికి సిద్ధం. ఈనెల 30న రాజమండ్రిలో రాష్ట్ర స్ధాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Andrea Jeremiah : ‘సైంధవ్ ’తో యాక్షన్లో జాస్మిన్.. గన్నుతో మామూలుగా లేదు
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!