Governor Abdul Nazeer: వైద్య రంగంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులకు, మెరిట్గా నిలిచిన విద్యార్థులను గవర్నర్ అభినందించారు. మరోవైపు.. ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్ద పీట వేస్తోందన్న ఆయన.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఏపీ చాలా ముందు ఉందని కితాబిచ్చారు.. ఇక, కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారు.. కోవిడ్ మహమ్మారితో పోరాడి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.
Read Also: Bastar :మరో కాంట్రవర్సీయల్ మూవీతో రాబోతున్న అదాశర్మ..బస్తర్ టీజర్ రిలీజ్..
Also Read
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
ఇక, ఆంధ్రప్రదేశ్లో 1,0132 విలేజ్ హెల్త్ కేర్ క్లినిక్ లు ఏర్పాటు చేశారు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్పై ప్రశంసలు కురిపించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. 1,0142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా హాస్పిటల్స్, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్ హాస్పిటల్స్, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్, 542 అర్బన్ పీహెచ్సీల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడించారు.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో ఏర్పటు అవుతోన్న 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
December Clash : డిసెంబర్ రేస్లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
-
FIFA World Cup 2026 Awards List: ఫిఫా వరల్డ్ కప్ అవార్డుల జాబితా.. అన్ని ప్రధాన వ్యక్తిగత అవార్డులు స్పెయిన్కే
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!