Kandi Pappu: తక్కువ ధరకే కందిపప్పు.. క్యూకట్టిన ప్రజలు
- బహిరంగ మార్కెట్ లో రూ. 195 నుండి రూ.200 పలుకుతోన్న కందిపప్పు..
- ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లలో కేజీ రూ. 160కే అందిస్తున్న అధికారులు..
- మూడు రోజుల పాటు అందుబాటులో ప్రత్యేక కౌంటర్లు..
- పలాసలో కందిపప్పు కౌంటర్ల దగ్గర క్యూలైన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandi Pappu: మరోసారి బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర క్రమంగా పైపైకి కదులుతోంది.. దీంతో, తక్కువ ధరకే సామాన్యులకు కందిపప్పు అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. దీనిలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా పలాసలో రెండు ప్రత్యేక కౌంటర్ల ద్వారా కంది పప్పును పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు.. కంది పప్పు ధరలు కొండెక్కిన నేపథ్యంలో ధరల నియంత్రణలో భాగంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ పలాసలో రెండు ప్రత్యేక కందిపప్పు కౌంటర్లను ఏర్పాటు చేయడంతో.. కందిపప్పు కోసం పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు ప్రజలు.
Read Also: Rs 200 and Rs 500 Notes: రూ.200, 500 నోట్ల రద్దు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
ఈ ప్రత్యేక కౌంటర్లను పలాస ఆర్డీవో భరత్ నాయక్ ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ లో కేజీ కందిపప్పు ధర రూ. 195 నుండి రూ.200 వరకు పలుకుతుండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌంటర్లలో కేజీ రూ. 160లకే అందిస్తుండటంతో పట్టణ ప్రజలు కందిపప్పు కోసం కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఈ ప్రత్యేక కందిపప్పు కౌంటర్లు నేటి నుంచి మూడు రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పలాస సీఎస్డీటీ రవికుమార్ తెలిపారు. ఇక, కందుపప్పు ప్రత్యేక కౌంటర్ల ప్రారంభోత్సవంలో తహసీల్దార్ వీఎస్ఎస్ నాయుడు, రెవెన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మరోవైపు.. తక్కువ ధరకే కందిపప్పును అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతున్నారు ప్రజలు.
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..