Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Cm Chandrababu Naidu Key Comments On Scrap Rs 200 And Rs 500 Notes

Rs 200 and Rs 500 Notes: రూ.200, 500 నోట్ల రద్దు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు

Published Date :July 9, 2024 , 7:38 pm
By Sudhakar Ravula
  • నోట్ల రద్దుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
  • రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో బ్యాంకర్లకు సూచన..
  • రూ.200.. రూ.500 నోట్లను రద్దు చేయని బ్యాంకర్లకు చెప్పాను..
  • అంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని చెప్పానన్న ఏపీ సీఎం..
Rs 200 and Rs 500 Notes: రూ.200, 500 నోట్ల రద్దు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rs 200 and Rs 500 Notes: పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఏ కరెన్సీ శాశ్వతం కాదు.. ఏ నోటు.. ఎప్పుడైనా రద్దు కావొచ్చు అనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది.. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంపై బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని.. మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలని.. సూపర్ సిక్స్‌లో పీ-4 గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. అంతే కాదు.. రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయని బ్యాంకర్లకు చెప్పానని.. అంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు.. విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రూ.200, రూ.500 నోట్ల రద్దు విషయాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.

Read Also: Russia: సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ

ఇక, రాష్ట్రంలోని వేర్వేరు అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏ అంశాలు ఎలా ధ్వంసం అయ్యయో తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి.. అన్ని శాఖల్లో నూ ఇదే పరిస్థితి ఉంది.. అందుకే రాష్ట్రానికి బాధ్యతాయుతమైన నాయకుడు ఉండాలి దీనిపై ఆలోచించమని ప్రజలకు చెబుతున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర భవిష్యత్ ను దారుణం గా దెబ్బ తీశారు.. మెరుగైన పాలన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. విద్యుత్ ఎప్పుడూ అభివృద్ధికి సూచికే.. 1995 – 2004 లో మొదటి విద్యుత్ సంస్కరణలు తెచ్చాం.. 2019-24 లో మధ్య గత ప్రభుత్వ హాయంలో 1,29 లక్షల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలు పై తెచ్చారు.. 2019-24 మధ్య విద్యుత్ టారిఫ్ కూడా పెరిగింది. ప్రజల పై భారం మోపారు.. విద్యుత్ సంస్థలు నష్టం చూశాయని ఆవేదన వ్యక్తిం చేశారు.. విద్యుత్ సంస్కరణ ల వల్ల అప్పట్లో మా ప్రభుత్వం ఓడి పోయినా విద్యుత్ సంస్కరణ లు గెలిచాయి.. ఏపీకి విద్యుత్ మిగులు కూడా వచ్చింది.. 2014 నుంచి లో విద్యుత్ ఉత్పత్తి 9453 మెగా వాట్ల మేర పెంచాం.. తలసరి వినియోగం ఏపీ లో 1234 యూనిట్ లకు పెరిగింది.. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రం గా ఏపీ ఎదిగిందన్నారు. మొత్తం గా 2018-19 నాటికి 14,929 మెగా వాట్లల ఉత్పత్తికి చేరేలా కృషి చేశామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.

Read Also: Encounter: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్.. కథువా ఉగ్రదాడి తర్వాత ఘటన..

2019 -24 మధ్య గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల పై 32,166 కోట్ల మేర భారం మోపారు.. అలాగే విద్యుత్ సంస్థలు పై 49,596 కోట్ల మేర అప్పులు తెచ్చారని విమర్శించారు చంద్రబాబు.. పాలనా పరమైన కారణాల వల్ల విద్యుత్ రంగం ఎదుర్కొన్న నష్టాల విలువ 47, 741 కోట్ల రూపాయలుగా ఉంది.. మొత్తంగా ప్రజల పైనా, ప్రభుత్వానికి జరిగిన నష్టం 1.29,503 కోట్లు రూపాయలు.. అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన నష్టం ఇది.. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పెట్టుబడులు కూడా రాకుండా పోయాయి.. సౌర విద్యుత్ పీపీఏ లను రద్దు చేస్తూ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం నష్ట పోయింది. కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల పై భారం మోపాయన్నారు. ట్రూ అప్, ఇంధన సర్చార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాల గా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు.. జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టు లోనే 4773 కోట్ల రూపాయలు మేర ప్రభుత్వం పై అదనపు భారం.. ఇలాగే 25 ఏళ్లు చెల్లింపులు చేస్తే 62 వేల కోట్ల రూపాయల మేర భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఊహించని కోణాల్లో ను విద్యుత్ సంస్థలు కు నష్టాలు వస్తున్నాయి.. ఏపీ బెవేరేజస్ కార్పొరేషన్ బాండ్లు లోనూ ఏపీ జెన్ కో , ట్రాన్స్ కో లు పెట్టుబడులు పెట్టాయి అంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM Chandrababu Naidu
  • Rs 200 and Rs 500 Notes
  • Scrap Rs 200
  • Scrap Rs 500 Notes

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions