Rs 200 and Rs 500 Notes: రూ.200, 500 నోట్ల రద్దు.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
- నోట్ల రద్దుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశంలో బ్యాంకర్లకు సూచన..
- రూ.200.. రూ.500 నోట్లను రద్దు చేయని బ్యాంకర్లకు చెప్పాను..
- అంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని చెప్పానన్న ఏపీ సీఎం..
Rs 200 and Rs 500 Notes: పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఏ కరెన్సీ శాశ్వతం కాదు.. ఏ నోటు.. ఎప్పుడైనా రద్దు కావొచ్చు అనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది.. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంపై బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని.. మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలని.. సూపర్ సిక్స్లో పీ-4 గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. అంతే కాదు.. రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయని బ్యాంకర్లకు చెప్పానని.. అంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు.. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రూ.200, రూ.500 నోట్ల రద్దు విషయాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.
Read Also: Russia: సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రధాని మోడీ
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ఇక, రాష్ట్రంలోని వేర్వేరు అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏ అంశాలు ఎలా ధ్వంసం అయ్యయో తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి.. అన్ని శాఖల్లో నూ ఇదే పరిస్థితి ఉంది.. అందుకే రాష్ట్రానికి బాధ్యతాయుతమైన నాయకుడు ఉండాలి దీనిపై ఆలోచించమని ప్రజలకు చెబుతున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర భవిష్యత్ ను దారుణం గా దెబ్బ తీశారు.. మెరుగైన పాలన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. విద్యుత్ ఎప్పుడూ అభివృద్ధికి సూచికే.. 1995 – 2004 లో మొదటి విద్యుత్ సంస్కరణలు తెచ్చాం.. 2019-24 లో మధ్య గత ప్రభుత్వ హాయంలో 1,29 లక్షల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలు పై తెచ్చారు.. 2019-24 మధ్య విద్యుత్ టారిఫ్ కూడా పెరిగింది. ప్రజల పై భారం మోపారు.. విద్యుత్ సంస్థలు నష్టం చూశాయని ఆవేదన వ్యక్తిం చేశారు.. విద్యుత్ సంస్కరణ ల వల్ల అప్పట్లో మా ప్రభుత్వం ఓడి పోయినా విద్యుత్ సంస్కరణ లు గెలిచాయి.. ఏపీకి విద్యుత్ మిగులు కూడా వచ్చింది.. 2014 నుంచి లో విద్యుత్ ఉత్పత్తి 9453 మెగా వాట్ల మేర పెంచాం.. తలసరి వినియోగం ఏపీ లో 1234 యూనిట్ లకు పెరిగింది.. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రం గా ఏపీ ఎదిగిందన్నారు. మొత్తం గా 2018-19 నాటికి 14,929 మెగా వాట్లల ఉత్పత్తికి చేరేలా కృషి చేశామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.
Read Also: Encounter: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్కౌంటర్.. కథువా ఉగ్రదాడి తర్వాత ఘటన..
2019 -24 మధ్య గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల పై 32,166 కోట్ల మేర భారం మోపారు.. అలాగే విద్యుత్ సంస్థలు పై 49,596 కోట్ల మేర అప్పులు తెచ్చారని విమర్శించారు చంద్రబాబు.. పాలనా పరమైన కారణాల వల్ల విద్యుత్ రంగం ఎదుర్కొన్న నష్టాల విలువ 47, 741 కోట్ల రూపాయలుగా ఉంది.. మొత్తంగా ప్రజల పైనా, ప్రభుత్వానికి జరిగిన నష్టం 1.29,503 కోట్లు రూపాయలు.. అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన నష్టం ఇది.. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పెట్టుబడులు కూడా రాకుండా పోయాయి.. సౌర విద్యుత్ పీపీఏ లను రద్దు చేస్తూ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం నష్ట పోయింది. కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల పై భారం మోపాయన్నారు. ట్రూ అప్, ఇంధన సర్చార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాల గా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు.. జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టు లోనే 4773 కోట్ల రూపాయలు మేర ప్రభుత్వం పై అదనపు భారం.. ఇలాగే 25 ఏళ్లు చెల్లింపులు చేస్తే 62 వేల కోట్ల రూపాయల మేర భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఊహించని కోణాల్లో ను విద్యుత్ సంస్థలు కు నష్టాలు వస్తున్నాయి.. ఏపీ బెవేరేజస్ కార్పొరేషన్ బాండ్లు లోనూ ఏపీ జెన్ కో , ట్రాన్స్ కో లు పెట్టుబడులు పెట్టాయి అంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!