Urea Shortage: యూరియా కొరతపై ఫోకస్ పెట్టిన సర్కార్.. ఈ నెలలోనే మొత్తం కోటా..!
- యూరియా కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి..
- ఆగస్టులో లక్షా 65 వేల టన్నులు రావాల్సి ఉండగా..
- ఇప్పటి వరకు 65 వేల టన్నుల యూరియా ఏపీకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urea Shortage: రాష్ట్రంలో యూరియా కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టులో లక్షా 65 వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకా లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే, జూలైలోనూ 50 వేల టన్నులు తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల, ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది. దీంతో యూరియా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.. మరోవైపు నౌకలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైంది. అధికారులు యూరియా కొరత పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందువల్ల కోటా ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం యూరియాను ఈ నెలలోనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
Read Also: Love: పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. వైజాగ్ తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావడంతో యువతి..
Also Read
ఈ నెల 25న నౌకలపై గంగవరం పోర్టుకు వచ్చే 18 వేల టన్నుల్లో సరుకు మొత్తం ఇవ్వాలని, 28న కాకినాడ పోర్టుకు రానున్న 42వేల టన్నుల్లో కనీసం 25వేల టన్నులు ఇవ్వాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు… మరోవైపు యూరియా వినియోగంపై కూడా కీలక సూచనలు చేసింది ఏపీ సర్కార్.. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రస్తుతం యూరియా కొనుగోలు చేయాలని.. ఫ్యాక్టరీల అవసరాల కోసం యూరియా విక్రయాలు సాగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?