Pawan Kalyan: నీరు దొరకనప్పుడే.. నీటి విలువ తెలుస్తుంది: డిప్యుటీ సీఎం
- జలజీవన్ మిషన్ ప్రధాని కల
- ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలన్నదే లక్ష్యం
- జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుందని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుందన్నారు. జలజీవన్ మిషన్ ప్రధాని నరేంద్ర మోడీ కల అని, ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలన్నదే లక్ష్యం అని తెలిపారు. జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నాం అని డిప్యుటీ సీఎం చెప్పారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ వర్క్ షాప్ను డిప్యుటీ సీఎం పవన్ ప్రారంబించారు. ఈ వర్క్ షాప్లో 26 జిల్లాల సీనియర్ ఇంజనీర్లు, డీఆర్ఈలు పాల్గొన్నారు. 26 జిల్లాలలోని నీటిపారుదల సదుపాయాలు, వినియోగకరమైన నీటి వనరులపై సమీక్ష జరిగింది.
డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘జలజీవన్ మిషన్ ప్రధాని మోడీ కల. ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలనేదే ఈ మిషన్ ఉద్దేశం. ప్రజలకు కూడా నీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలన్నది మా ఉద్దేశం. నీటి వినియోగంలో ఐటీ వినియోగం కూడా భాగం. అమృతధార అనే పేరుతో ఇది మనం చేస్తున్నాం. నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుంది. భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుంది. కేంద్రం రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వాలని అంటే.. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం చేసింది. 38 రిజర్వాయర్లు ఉన్నాయి మనకు, వాటి నుంచి సరఫరా ఉండాలి. బోర్ పాయింట్ల పేరుతో గత ప్రభుత్వంలో 4వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి’ అని అన్నారు.
Also Read
జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నాం. జలజీవన్ మిషన్లో బోర్ వెల్స్ ను వాడటంవల్ల ఉపయోగం లేకుండా పోయింది. జిల్లాల వారీగా జలజీవన్ మిషన్ అమలులోని ఇబ్బందులను తెలుసుకోవాలనే ఈ వర్క్ షాప్ నిర్వహించాం. మానవతా దృక్పధంతో జలజీవన్ మిషన్ అమలు కావాలి. ఈ మిషన్లో పైప్ లైన్ డిజైనింగ్లో లోపాలున్నాయి. నీళ్ళొస్తుంటే మధ్యలో మోటార్లు వేసి లాగేయకుండా చూడాలి. డబ్బులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదు. అవసరమైన చోట టెక్నాలజీని చేర్చడం జరుగుతుంది. ఫిల్టర్ బెడ్లను కూడా చాలా చోట్ల మార్చలేదు. క్షేత్రస్ధాయిలో సలహాలు, సూచనలు అధికారులు ఇవ్వాలి. ఇవాళ సాయంత్రానికి ఈ జలజీవన్ మిషన్కు ఒక స్ధిరమైన సాధన సహకారాలు కావాలి’ అని డిప్యుటీ సీఎం పవన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!