Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!
- రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం
- నాతో సమానంగా జనసేన కోసం నాగబాబు పని చేశారు
- నాగబాబు ముందుగా ఎమ్మెల్సీగా ఎంపికవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా జనసేన పార్టీ కోసం పని చేశారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పేర్కొన్నారు. నాగబాబు ముందుగా ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, మంత్రి పదవి విషయం తర్వాత ఆలోచిస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ కోసం పవన్ సోదరుడు నాగబాబు ఎంతో కష్టపడిన విషయం తెలిసిందే.
మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియా చిట్చాట్లో పాల్గొనగా.. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. ‘ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదు. నాతో కలిసి పని చేసిన వారిని నేను చూసుకోవాలి. నాకోసం, నాతో పని చేసింది వీరే. నాగబాబును రాజ్యసభ సీటు నుంచీ రీకాల్ చేశాను. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నా ఉద్దేశం. జనసేన ఇప్పుడే పుడుతున్న పార్టీగా అనుకోవాలి. నాగబాబు విషయంలో అడుగుతారు కానీ.. వైఎస్ జగన్ విషయంలో ఎవరూ అడగరు. వారసత్వ రాజకీయాలు అని అనడం లేదు.నాగబాబును ఎమ్మెల్సీ చేసాక.. మంత్రిని చేసే విషయం ఆలోచిస్తాం. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారు. కులం చూసి నేను మనుషులను ఎంచుకోలేదు. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు, ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చా’ అని పవన్ చెప్పారు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
‘పార్టీని నేను పట్టించుకునే సమయం దొరకడం లేదు. నేను నా కేడర్ని కలవలేకపోతున్నా. జనవరి 4 నుంచి 14 నాటికి బాగా ప్రిపేర్ అవుతాం. ఇంకా ఏ జిల్లా నుంచి పర్యటన అనేది నిర్ణయించలేదు. సమాన్యుడి సమస్యలు తెలియాలంటే లెఫ్ట్ అనేదే దారి. నాకు గద్దర్ కి మధ్య చాలా అంతరంగిక సంభాషణలుంటాయి. ఖురాన్ ను కళ్ళకద్దుకుని తీసుకుంటాం కానీ భగవద్గీతను అలా తీసుకుంటారని ఆశించలేం. హిందూని మాత్రమే ఖండిస్తారా?, ముస్లింని ఖండించరా? అని నేను లెఫ్ట్ పార్టీలను అడిగాను. రాష్ట్రానికి అభివృద్ధి చాలా అవసరం, మానవ వనరులకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వకుండా తీసుకురాలేం. ప్రజలను స్వయం సమృద్ధిగా తయారు చేయాలి. సంక్షేమం మీద మాత్రమే ప్రజల అభివృద్ధి ఆధారపడదు. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు వంద వరకూ చనిపోయాయి అనే సమాచారం వచ్చింది. కారణం పర్యావరణ కాలుష్యం అని తెలిసింది. మేం పూర్తిస్ధాయిలో తాబేళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
- Tags
- ap
- janasena
- Naga Babu
- pawan kalyan
- tdp
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!