Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!
- రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం
- నాతో సమానంగా జనసేన కోసం నాగబాబు పని చేశారు
- నాగబాబు ముందుగా ఎమ్మెల్సీగా ఎంపికవుతారు
సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా జనసేన పార్టీ కోసం పని చేశారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పేర్కొన్నారు. నాగబాబు ముందుగా ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, మంత్రి పదవి విషయం తర్వాత ఆలోచిస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ కోసం పవన్ సోదరుడు నాగబాబు ఎంతో కష్టపడిన విషయం తెలిసిందే.
మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియా చిట్చాట్లో పాల్గొనగా.. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. ‘ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదు. నాతో కలిసి పని చేసిన వారిని నేను చూసుకోవాలి. నాకోసం, నాతో పని చేసింది వీరే. నాగబాబును రాజ్యసభ సీటు నుంచీ రీకాల్ చేశాను. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నా ఉద్దేశం. జనసేన ఇప్పుడే పుడుతున్న పార్టీగా అనుకోవాలి. నాగబాబు విషయంలో అడుగుతారు కానీ.. వైఎస్ జగన్ విషయంలో ఎవరూ అడగరు. వారసత్వ రాజకీయాలు అని అనడం లేదు.నాగబాబును ఎమ్మెల్సీ చేసాక.. మంత్రిని చేసే విషయం ఆలోచిస్తాం. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారు. కులం చూసి నేను మనుషులను ఎంచుకోలేదు. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు, ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చా’ అని పవన్ చెప్పారు.
Also Read
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
- Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
‘పార్టీని నేను పట్టించుకునే సమయం దొరకడం లేదు. నేను నా కేడర్ని కలవలేకపోతున్నా. జనవరి 4 నుంచి 14 నాటికి బాగా ప్రిపేర్ అవుతాం. ఇంకా ఏ జిల్లా నుంచి పర్యటన అనేది నిర్ణయించలేదు. సమాన్యుడి సమస్యలు తెలియాలంటే లెఫ్ట్ అనేదే దారి. నాకు గద్దర్ కి మధ్య చాలా అంతరంగిక సంభాషణలుంటాయి. ఖురాన్ ను కళ్ళకద్దుకుని తీసుకుంటాం కానీ భగవద్గీతను అలా తీసుకుంటారని ఆశించలేం. హిందూని మాత్రమే ఖండిస్తారా?, ముస్లింని ఖండించరా? అని నేను లెఫ్ట్ పార్టీలను అడిగాను. రాష్ట్రానికి అభివృద్ధి చాలా అవసరం, మానవ వనరులకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వకుండా తీసుకురాలేం. ప్రజలను స్వయం సమృద్ధిగా తయారు చేయాలి. సంక్షేమం మీద మాత్రమే ప్రజల అభివృద్ధి ఆధారపడదు. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు వంద వరకూ చనిపోయాయి అనే సమాచారం వచ్చింది. కారణం పర్యావరణ కాలుష్యం అని తెలిసింది. మేం పూర్తిస్ధాయిలో తాబేళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
- Tags
- ap
- janasena
- Naga Babu
- pawan kalyan
- tdp
తాజావార్తలు
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!