Gidugu Rudraraju: వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్లో ఉన్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Rudraraju: వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. విజయవాడలో జరుగుతోన్న కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పొలిటికల్ వేక్యూమ్ ఉందన్నారు. 2014 నుంచి రెండు ప్రభుత్వాలు ఏపీ హక్కులు, విభజన హామీల కోసం పని చేయలేదన్న ఆయన.. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి… ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా స్ధానం ఉందన్నారు. ఇప్పటికే, పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడంతో ఏపీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నాం అన్నారు. ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై స్ట్రాటజీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది.. మేనిఫెస్టో, ఏపీసీసీ ఆశించే అంశాలు, ఏపీకి ఏం చేయాలనే అంశాలు స్ట్రాటజీ సమావేశంలో నిర్ణయిస్తారు.. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్ట్రాటజీ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.
Read Also: Pindam: ‘పిండం’ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది- హీరోయిన్ ఖుషీ రవి
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఇక, కాంగ్రెస్ పార్టీలో విద్యాభ్యాసం చేసిన మంత్రి ఒకరు కామెంట్ చేస్తున్నారు.. చంద్రబాబు, జగన్, ఇలా చాలా మందికి కాంగ్రెస్ మాతృ సంస్ధ అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు గిడుగు రుద్రరాజు.. ఒకచోట పనిచేయని వ్యక్తి రెండో చోట వైసీపీకి ఎలా పనికొస్తారు? అని ప్రశ్నించారు. వైసీపీ మార్చిన సీట్లన్నీ దళిత, బలహీన వర్గాల సీట్లే అని దుయ్యబట్టారు. సీఎం జగన్ పనితనం మీద ప్రజలు జడ్జిమెంట్ ఇస్తారు.. కేసీఆర్ చేసింది చాలు అని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు.. ఏపీలో ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తెస్తున్నారు.. కొత్త సీసాలో పాత సారాయి లాగా అంటూ దుయ్యబట్టారు.
Read Also: Smriti Irani : మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ ఇవ్వకూడదు : స్మృతి ఇరానీ
మరోవైపు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందన్నారు గిడుగు రుద్రరాజు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేస్తామన్న ఆయన… సీపీఐ, సీపీఎం నేతలతో కలిసి మాట్లాడాం.. పేకమేడలా అధికారం కూలిపోతే.. కాంగ్రెస్ కు ఆటోమేటిగ్గా వచ్చి చేరతారని జోస్యం చెప్పారు. వైసీపీలో ఒక బలమైన నియోజకవర్గం నుంచి ఓ వ్యక్తి మాతో మాట్లాడారు.. వైఎస్ఆర్, కాంగ్రెస్.. రెండూ మా పేర్లే.. వైసీపీ ఒరిజినల్ కాదు.. డూప్లికేట్ కాంగ్రెస్ అని ప్రజలు గుర్తించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!