EC Notices To Jagan: ఏపీ సీఎం జగన్ కు ఆ విషయంపై నోటీసులు ఇచ్చిన ఈసీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉలగించినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసుల అందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తన ప్రసంగాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు పై చర్యల నేపథ్యంలో శివ ముఖేష్ కుమార్ మీనా జగన్ మోహన్ రెడ్డికు నోటీసులు జారీ చేశారు.
Also Read: Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
Also Read
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
- Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
ఈ నోటీసుకు సంబంధించి వచ్చే 48 గంటల్లో ఆయన వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. ఈ విషయంపై సకాలంలో స్పందించకపోతే ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోపోతున్నట్లు సీఈఓ తెలిపారు. ఇక ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ నాయకులు ఎదుటి పార్టీ నాయకులు పై విమర్శలపర్వం గుప్పించడంతో చాలామందికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ నాయకుడు అచ్చం నాయుడు, అయ్యన్నపాత్రులు.. అలాగే వైస్సార్సీపీ నుండి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Also Read:Rani Rudrama Devi: కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు..
సీఎం జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సంబంధించి సీఈవో ముకేష్ కుమార్ మీనా చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల పై కూడా కేవలం 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ సూచించింది. మార్చి 31న జరిగిన ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైస్సార్సీపీ సీఈవో కు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ రాక్షసుడు, జంతువు, దొంగ అంటూ చంద్రబాబు మాట్లాడారని.. వైస్సార్సీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!