Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Jagan Attending Niti Aayog Agriculture Natural Farming Workshop Through Video Conference

CM Jagan: ప్రకృతి వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి

Published Date :April 25, 2022 , 3:02 pm
By Ramesh Nalam
CM Jagan: ప్రకృతి వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమరావతిలో సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ప్రకృతి వ్యవసాయం కోసం ఏపీ సీఎం ఇప్పటికే అద్భుతమైన చర్యలు తీసుకున్నారని.. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని.. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయమంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

మరోవైపు ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ… వినూత్న వ్యవసాయ పద్ధతులపై నీతిఆయోగ్‌ సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. మన సమాజం ఆరోగ్యంగా ఉంచడానికి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సాధించాలన్నారు. రైతులు పురుగుల మందులు, రసాయన ఎరువులను వాడకుండా సేంద్రీయ విధానాల వైపునకు వెళ్లాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారని తెలిపారు. 10,778 రైతు భరోసా కేంద్రాల్లో 3009 చోట్ల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని.. రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం వైపునకు తమ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని జగన్ పేర్కొన్నారు.

ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిటకే అన్నిరకాల సేవలు అందుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 10778 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయానికి బలం ఇవ్వడానికి ప్రత్యేకంగా కస్టర్ హైరింగ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని వ్యవసాయ కార్యకలాపాలకు వన్‌స్టాప్‌ సెంటర్‌గా ఆర్బీకేలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో కల్తీలను పూర్తిగా నివారించడమే కాకుండా, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వాటిని ఆర్బీకేల ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ- క్రాప్‌ను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని.. అలాగే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ను కూడా పెట్టామని చెప్పారు.

మరోవైపు రైతుల్లో అవగాహనను పెంచడానికి పొలంబడి నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రైతులు 30–50 ఏళ్లుగా రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యసాయం చేస్తున్నారని.. ప్రకృతి, వ్యవసాయ విధానాలకు జర్మనీ ప్రభుత్వం ఇండో జర్మన్‌ గ్లోబల్‌ అకాడమీ ఆన్‌ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్‌, లెర్నింగ్‌ (ఐసీసీఏఏఆర్‌ల్‌) ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 20 మిలియన్‌ యూరోలను జర్మనీ ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలకు తగిన విధంగా అండగా నిలిచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలని సూచించారు. యూనివర్శిటీల్లో సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై తగిన కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలన్నారు, నేచరల్‌ వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.

Somu Veerraju: టీచర్లకు వేసవికాలంలో కాకుండా వర్షాకాలంలో సెలవులు ఇస్తారా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • natural forming
  • NITI Aayog

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ లో 50 మంది విద్యార్థులు మృతి.. బుర్జ్ ఖలీఫా ఖాళీ..

  • Pakistan vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. బాబర్ ఔట్.. పాకిస్థాన్‌ జట్టులో ఊహించని మార్పులు!

  • Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్ షట్ డౌన్..

  • Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో వాడుతున్న ఆయుధాలు, వాటి ప్రత్యేకతలు ఇవే..

  • IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!

  • Gold & Silver Prices: యుద్ధం ఎఫెక్ట్.. కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. వామ్మో ఒక్కరోజులో ఇంత పెరిగాయేంటి?

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions