CM Chandrababu: విశాఖ-విజయనగరం కలిసిపోతాయి.. జూన్ 2026కి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి..
- భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు..
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం భోగాపురం ఎయిర్పోర్ట్..
- విశాఖ - విజయనగం కలిసిపోతుంది..
- 45 మిలియన్ ప్రయాణికులు ట్రావెల్ చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటి.. అయితే, జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పూర్తికానున్నట్టు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భోగాపురం చేరుకున్న సీఏం చంద్రబాబుకు మంత్రులు అధికారులు.. పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయ పనులను పరిశీలించారు చంద్రబాబు.. అనంతరం రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ పై సెంట్రల్ ఏవియేషన్ అధికారులతో సమీక్ష చేశారు.. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంటుండగానే కాకినాడ, అమలాపురంలో ఎయిర్ పోర్ట్ లకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.. ఇక, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందని జీఎంఆర్ ప్రతినిధులను అడిగారు చంద్రబాబు.. దానికి సమాధానంగా 2026 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు జీఎంఆర్ ప్రతినిధులు.. అలాగే మౌలిక సదుపాయాల వాటర్, పవర్ అందించే విషమై చొరవ చూపాలని సీఎం చంద్రబాబును కోరారు జీఎంఆర్ ప్రతినిధులు..
Read Also: Lung cancer: భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణం ఇదే…
Also Read
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ఇక, అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం భోగాపురం ఎయిర్ పోర్ట్.. ఇది గ్రోత్ ఇంజన్ గా పనిచేస్తుందని తెలిపారు.. రానున్న రోజుల్లో విశాఖపట్నం – విజయనగం కలిసిపోతాయన్నారు.. ఫేజ్ వన్ లో బీచ్ రోడ్, ఫేజ్ త్రీలో శ్రీకాకుళం రోడ్.. 5 వేల ఎకరాలు తీసుకోడం జరిగింది.. ఎయిర్ పోర్ట్ పనులు చూస్తే 38 శాతం పూర్తి చేశారని తెలిపారు.. ఈ ఎయిర్పోర్ట్ నుంచి 45 మిలియన్ పాసింజర్ ట్రావెల్ చేస్తారు.. అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, పారిశ్రామికంగా ఎదడగానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే, కొంత హైవేల వద్ద కనెక్టివిటీ సమస్య ఉందని గుర్తించాం.. అలాగే స్టేట్ హైవేలో కూడా సమస్యలు ఉన్నాయి.. వీటిని కూడా పరిష్కరించేలా ముందుకు వెళ్తాం అన్నారు. నా తొలి పర్యాటక ఉత్తరాంధ్ర పెట్టుకున్నా.. అన్నివిధాలా అభివృద్ధి చేసి విశాఖ రుణం తీర్చుకుంటాం అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. నాపై ప్రజలకు.. ప్రజలపై నాకు నమ్మకం ఉంది.. మాకు పవన్ కల్యాణ్, బీజేపీ తోడయ్యారు.. చరిత్రక విజయాన్ని అందించారని గుర్తుచేశారు.. భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు.. రాష్ట్రంలో ఇంకా ఐదారు ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయన్నారు చంద్రబాబు. కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్తో పాటు మూలపేటను కూడా పరిశీలిస్తున్నాం.. అవికాకుండా ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తామని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!