Lung cancer: భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణం ఇదే…
- ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంబంధించి షాకింగ్ విషయాలు
- భారత్ లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
- ఈ వ్యాధిబారిన పడిన వారిలో ఎక్కువ మంది ఎప్పుడూ పొగతాగని వారే ఉన్నట్లు అధ్యయనం వెల్లడి
- ఇండియాలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సగటు వయస్సు 28.2 సంవత్సరాలుగా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంబంధించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలోని యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో ఎక్కువ మంది ఎప్పుడూ పొగతాగని వారే ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ఊపిరితిత్తుల క్యాన్సర్పై ఓ అధ్యయనాన్నిసైన్స్ జర్నల్ ‘లాన్సెట్’లో ప్రచురించారు. ఇప్పుడు పొగతాగని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తోందని దాంట్లో తెలిపారు.
READ MORE: BMW Hit-And-Run: యాక్సిడెంట్కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్షా..
Also Read
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
లాన్సెట్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. 2020లో ప్రపంచవ్యాప్తంగా 22 లక్షలకు పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 18 లక్షల మంది మరణించారు. భారత్ లో 2020లో 72,510 మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ సంవత్సరం 66,279 మంది రోగులు మరణించారు. 2020లో భారతదేశంలో సంభవించిన క్యాన్సర్ మరణాలలో 7.8% ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించాయి.
READ MORE: Venky Anil3: యానిమల్ నటుడిని దింపుతున్న రావిపూడి
భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలో సగటు వయస్సు పాశ్చాత్య దేశాలలో కంటే 10 సంవత్సరాలు తక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సగటు వయస్సు 28.2 సంవత్సరాలగా వెల్లడించింది. అయితే.. దీనికి ఒక కారణం భారతదేశంలోని యువ జనాభా కూడా కావచ్చు. పాశ్చాత్య దేశాలలో, ఊపిరితిత్తుల క్యాన్సర్ 54 నుంచి 70 సంవత్సరాల మధ్య నిర్ధారణ చేయబడుతుంది. అయితే.. అమెరికాలో ఈ క్యాన్సర్ బారిన పడ్డ రోగుల సగటు వయస్సు 38 సంవత్సరాలు కాగా.. చైనాలో 39 సంవత్సరాలగా అధ్యయనం పేర్కొంది. 1990లో.. భారతదేశంలో ప్రతి లక్ష జనాభాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ రేటు 6.62 ఉండగా.. అది 2019లో 7.7కి పెరిగింది. 1990 నుంచి 2019 మధ్యకాలంలో.. ఇది పురుషులలో 10.36 నుంచి 11.16కి .. స్త్రీలలో 2.68 నుంచి 4.49కి పెరిగింది.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!