CM Chandrababu: పోలవరంపై చంద్రబాబు సమీక్ష.. త్వరలో ప్రాజెక్టు సందర్శన..!
- ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు
- పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్న సీఎం
- సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, పాలనపై ఫోకస్ పెట్టారు.. ఈ రోజు తన కేబినెట్లోని 24 మంత్రులకు శాఖలు కేటాయించిన ఆయన.. మరోవైపు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అయితే, సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది.. ఇక, శ్వేత పత్రాల విడుదలకు కూడా సిద్ధం అవుతోంది చంద్రబాబు సర్కార్. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రతీసోమవారం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ.. పనులపై సమీక్ష నిర్వహిస్తూ వచ్చిన విషయం విదితమే.
Read Also: EPFO: చందాదారులకు షాకింగ్ న్యూస్.. అడ్వాన్స్ సదుపాయం నిలిపివేత
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడుతోనే పూర్తతుందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుకు జలవనల శాఖను కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రైతు సంఘాల ఆధ్వర్యంలో కాటన్ దొర విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి రైతులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రైతుబిడ్డ నిమ్మలకు జలవనుల శాఖ కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. రైతు బిడ్డ రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి ఇరిగేషన్ మంత్రి రామానాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!