CM Chandrababu: ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి..
- ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు
- చంద్రబాబుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఈనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉంటారనుకోలేదని అన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం బీజేపీకే ఓటు వేయాలని తెలిపారు. ఢిల్లీలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ నాయకత్వం గొప్పగా ఉందంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Read Also: Ind vs Eng 5th T20: దంచికొట్టిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్
Also Read
- RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
- Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
ప్రధాన మంత్రి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ను ప్రమోట్ చేస్తున్నారు.. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను.. ఇపుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీ గెలుపు దేశ చరిత్రలో ఒక మలుపు అని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో భారతీయులను ఎదుర్కొనే వాళ్ళు ప్రపంచంలో లేరు.. సరైన నాయకుడు సరైన సమయంలో దేశానికి మోడీ నేతృత్వం వహిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ప్రపంచం మొత్తం భారత దేశం బ్రాండ్ మోగుతోంది.. ప్రధాని మోడీ దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోతున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: Naga Chaitanya: అసలైన బుజ్జి తల్లి శోభితే.. కానీ ఆ విషయంలో చాలా ఫీల్ అయింది!
2047 నాటికి దేశం శక్తివంతంగా మారుతుంది.. 1995లో పాడుబడిన హైదరాబాద్లా ఢిల్లీ మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్గా ఉంది.. ఢిల్లీ నుంచి అందరూ హైదరాబాద్, బెంగుళూరు వెళ్తున్నారని అన్నారు. వెదర్ పొల్యూషన్, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ కలుషితం అయిందని తెలిపారు. గర్వపడేలా దేశ రాజధాని ఉండాలి.. ఊపిరి పిల్చుకోవాలంటే, ప్రధాని మోడీ ఆక్సిజన్ ఇస్తేనే సాధ్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. భారత దేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంది.. కానీ ఢిల్లీ మాత్రం సమస్యల వలయంలో ఉందని ఢిల్లీ ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
-
Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
-
Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
-
Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!