CM Chandrababu: ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీరావు.. ఇద్దరూ ఇద్దరే..
- ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు.. ఇద్దరూ ఇద్దరే నన్న సీఎం చంద్రబాబు..
- రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న చంద్రబాబు..
- ఎన్టీఆర్ తో పాటు రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నది ప్రతీ ఒక్కరి ఆకాంక్ష అన్న సీఎం..
- అమరావతి.. ఢిల్లీలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు..
- అమరావతిలో ఓ రోడ్ కు రామోజీ మార్గ్ అని పేరు పెడతాం..
- విశాఖలో రామోజీరావు చిత్రపురి నిర్మిస్తాం అని సీఎం ప్రకటన..
CM Chandrababu: ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు.. ఇద్దరూ ఇద్దరే అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్లోని కానూరులో ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో పాటు రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్నది ప్రతీ ఒక్కరి ఆకాంక్ష అన్నారు.. ఇక, అమరావతి, ఢిల్లీలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం.. అమరావతిలో ఓ రోడ్ కు రామోజీ మార్గ్ అని పేరు పెడతాం.. విశాఖలో రామోజీరావు చిత్రపురి నిర్మిస్తాం అని పేర్కొన్నారు.. భయమనేది రామోజీరావు జీవితంలో లేదు.. పోరాటం ఆయనలో ఓ భాగం.. రామోజీరావు అక్షర శిఖరం.. సాధారణ కుటుంబంలో పుట్టి అచంచలమైన విశ్వాసంతో ఎదిగారు.. రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ.. చేపట్టిన ఏ రంగమైనా ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేశారు అంటూ ఆ అక్షర యోధుడిని స్మరించుకున్నారు.
Read Also: Realme Narzo 70 Pro 5G: రియల్ మీ నుంచి తక్కువ ధరకే ఫోన్.. ఫీచర్లు అదుర్స్
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
మార్గదర్శిలో ప్రతీ పెట్టుదారుడు రామోజీరావు వెంటే నిలిచారంటే అదీ ఆయన విశ్వసనీయత అన్నారు చంద్రబాబు.. 40 ఏళ్లుగా నెంబర్1 లో ఈనాడు ఉందంటే ఎంతటి కార్యదీక్ష ఉందో అందరూ అర్ధం చేసుకోవాలన్న ఆయన.. రాజధానికి రామోజీరావు సూచించిన పేరు ప్రపంచ మంతా మార్మోగింది.. తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత.. రామోజీరావు స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల ప్రజలది అన్నారు. ఇక, విశాఖలో రామోజీరావు మొదటి అడిషన్ పెట్టారు.. ఈనాడు ప్రజాగళంగా ప్రజా చైతన్యం కోసం పనిచేస్తున్నది.. పత్రికా రంగంలో ఉండి రామొజీరావు ప్రజా సమస్యల కోసం పని చేసారు.. సినిమా రంగంలో, జర్నలిజంలో ఎందరినో తయారు చేసారు.. ఒక మెగా స్కేలులో ఆలోచించి జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు.. ఇతర రాష్ట్రాలలో తుఫానులు వచ్చినా ముందుండి సేవలు అందించారు.. ఏ పని చేసినా ప్రజాహితం కోసం పని చేసారు రామోజీరావు.. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ప్తజలు గుర్తు పెట్టుకుంటారు అని కొనియాడారు..
Read Also: Teacher Transfers: తెలంగాణలో 18, 942 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు..!
ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా.. ధైర్యంగా ఎదుర్కొన్నారు అని గుర్తుచేశారు చంద్రబాబు.. ఏ ఐఏఎస్ ను బదిలీ చేయమని, ఏ పనీ తనకు చేసి పెట్టమని ఏరోజు అడగని వ్యక్తి రామోజీరావు.. పదవులు కోసం కాదం ప్రజా చైతన్యం కోసం పని చేసిన వ్యక్తి రామోజీరావు.. అప్పట్లో 9 నెలల్లో రామారావు అధికారంలోకి రావడంలో రామోజీరావు పాత్ర ఉంది.. రాజీ పడకుండా పోరాడి, సుప్రీంకోర్టు వరకూ వెళ్ళి తన పనులు నిజం అని నిరూపించుకున్న వ్యక్తి రామోజీరావు.. నలభై ఏళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి రామోజీరావు అని గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!