AP CM Chandrababu: ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే..
- 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- గత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని. 2019, 2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు.. చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని ఆయన విమర్శించారు. ఆయన పరదాలు కట్టుకుని పైన వస్తుంటే కింద చెట్లు కూడా కొట్టేవారని అన్నారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడొచ్చని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు.
Read Also: YS Jagan: శ్రీవారి లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ రియాక్షన్
Also Read
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఈ వంద రోజులు పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చానన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం 4 వేల పెన్షన్ ఇస్తోందన్నారు. ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రతీ ఒక్క ఇంటికి లాభం కలగాలని ఆలోచన చేశామన్నారు. మొదటిగా పెన్షన్ పెట్టింది ఎన్టీఆర్ అని.. తాము మొదటిసారి సీఎం అయిన తర్వాత 75 రూపాయలకు పెంచామన్నారు. ఇప్పుడు అది నాలుగు వేలకు తానే పెంచానని స్పష్టం చేశారు. ఇంకా ఎక్కువ ఇద్దామన్నా డబ్బు లేదన్నారు. సంపద సృష్టిస్తే తప్ప ఏదీ సాధ్యం కాదన్నారు. ఉద్యోగులకు సెలవులు వచ్చినా జీతాలు ఇచ్చామని సీఎం చెప్పారు. ప్రతీ నెలకు ఒకసారి అధికారులు మీ ఇళ్లకు వచ్చి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. తాను వెళ్లి పరిశీలించిన ఇళ్ల వద్ద వారి సమస్యలు తెలుసుకున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐదేళ్లుగా గత ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డ పఠాన్ కాజావళి కుటుంబానికి ఆదుకుంటామన్నారు.
పరిస్థితుల ప్రభావం వల్ల చాలా మంది పిల్లలు చదివించలేక చాల మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకునే పని చేస్తుందన్నారు. ఏపీ ఇచ్చే పెన్షన్ అన్నీ ధనిక రాష్ట్రాల కన్నా ఎక్కువ అని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ చాలామంది అనర్హులకు ఇచ్చిందని, వికలాంగులు కాని వారికి కూడా ఆ కోటాలో ఇచ్చారని విమర్శించారు. వచ్చే అక్టోబర్లో అందరి పరిస్థితిని కనుక్కుని వారికి అవసరమైన పెన్షన్ ఇస్తామన్నారు. డాక్టర్లు వికలాంగులు కానీ వారికి సర్టిఫికెట్లు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!