AP CM Chandrababu: ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే..
- 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- గత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదన్న సీఎం
AP CM Chandrababu: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని. 2019, 2024 మధ్య పనిచేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని చూడలేదు.. చూడబోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని ఆయన విమర్శించారు. ఆయన పరదాలు కట్టుకుని పైన వస్తుంటే కింద చెట్లు కూడా కొట్టేవారని అన్నారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడొచ్చని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు.
Read Also: YS Jagan: శ్రీవారి లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ రియాక్షన్
Also Read
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
- Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ఈ వంద రోజులు పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చానన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం 4 వేల పెన్షన్ ఇస్తోందన్నారు. ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రతీ ఒక్క ఇంటికి లాభం కలగాలని ఆలోచన చేశామన్నారు. మొదటిగా పెన్షన్ పెట్టింది ఎన్టీఆర్ అని.. తాము మొదటిసారి సీఎం అయిన తర్వాత 75 రూపాయలకు పెంచామన్నారు. ఇప్పుడు అది నాలుగు వేలకు తానే పెంచానని స్పష్టం చేశారు. ఇంకా ఎక్కువ ఇద్దామన్నా డబ్బు లేదన్నారు. సంపద సృష్టిస్తే తప్ప ఏదీ సాధ్యం కాదన్నారు. ఉద్యోగులకు సెలవులు వచ్చినా జీతాలు ఇచ్చామని సీఎం చెప్పారు. ప్రతీ నెలకు ఒకసారి అధికారులు మీ ఇళ్లకు వచ్చి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. తాను వెళ్లి పరిశీలించిన ఇళ్ల వద్ద వారి సమస్యలు తెలుసుకున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐదేళ్లుగా గత ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డ పఠాన్ కాజావళి కుటుంబానికి ఆదుకుంటామన్నారు.
పరిస్థితుల ప్రభావం వల్ల చాలా మంది పిల్లలు చదివించలేక చాల మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకునే పని చేస్తుందన్నారు. ఏపీ ఇచ్చే పెన్షన్ అన్నీ ధనిక రాష్ట్రాల కన్నా ఎక్కువ అని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ చాలామంది అనర్హులకు ఇచ్చిందని, వికలాంగులు కాని వారికి కూడా ఆ కోటాలో ఇచ్చారని విమర్శించారు. వచ్చే అక్టోబర్లో అందరి పరిస్థితిని కనుక్కుని వారికి అవసరమైన పెన్షన్ ఇస్తామన్నారు. డాక్టర్లు వికలాంగులు కానీ వారికి సర్టిఫికెట్లు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!