AP CEO MK Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CEO MK Meena: ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు అక్రమ నగదు 203 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగదుతో సహా మద్యం, గంజాయి, విలువైన ఆభరణాలను సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు. సీజ్లకు సంబంధించి 9 వేల కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 10,400లకు పైగా ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ 14 సెగ్మెంట్లల్లో భద్రత కూడా పెంచుతామన్నారు. ఓటర్లకు ఎండతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఎండల కారణంగా తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
Read Also: AP Pensions: ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు.. ఎండలో బ్యాంకుల వద్ద క్యూలు
Also Read
హోం ఓటింగ్ కోసం కేవలం 28591 మంది మాత్రమే ఎంచుకున్నారని. మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నారని సీఈవో తెలిపారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఇవాళ నుంచే ప్రారంభమైందని.. ఈ నెల 8వ తేదీతో పూర్తి అవుతుందన్నారు. ఎనిమిదో తేదీలోగానే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాస్ గుర్తును మొత్తంగా 15 చోట్ల మార్చామని చెప్పారు. ఆ 15 స్థానాల్లో స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించామన్నారు. విశాఖలో పార్లమెంట్ పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయని.. మంగళగిరి, తిరుపతి సెగ్మెంట్లల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయన్నారు. 15 వేల బ్యాలెట్ యూనిట్లను అదనంగా తెప్పించామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1500 ఓటర్లకు మించి ఉంటే ఆ పోలింగ్ కేంద్రానికి అనుబంధంగా మరొక పోలింగ్ కేంద్రం(ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం) ఏర్పాటు చేస్తామని సీఈవో వెల్లడించారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదించామని చెప్పారు.
ఏపీ సీఈవో మాట్లాడుతూ.. “పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పోలీస్ అధికారులకు పంపాం. ఎవరికైనా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటే సెక్యూర్టీ ఇవ్వాలని సూచించాం. 374 మంది అసెంబ్లీ అభ్యర్థులకు.. 64 మంది పార్లమెంట్ అభ్యర్థులకు భద్రత కల్పించాలని పోలీస్ అధికారులు సూచించారు. 1.60 లక్షల బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నాం. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎంత మేరకు వచ్చాయనేది ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు. ఎన్నికల విధుల్లో 3.30 లక్షల మంది ఉన్నారు. గోవా, హర్యానా, యానాం, తెలంగాణ నుంచి లిక్కర్ వస్తోంది. గోవా, హర్యానా డీజీపీలతో మేం మాట్లాడాం. లిక్కర్ సరఫరా వెనుక ఒకరిద్దున్నారని తెలిసింది. ప్రతి జిల్లాలో ఎఫ్ఎస్టీ టీంస్ ఉన్నాయి. మద్యం అక్రమాలను అరికడుతున్నాం. ప్రభుత్వ సింబల్ కొన్ని ప్రకటనల్లో వాడుతున్నారు. ఈసీ పర్మిషన్ కోసం వచ్చినప్పుడు బ్లర్ చేసే చూపారు. ఆ తర్వాత ప్రభుత్వ సింబల్ ఉన్న ప్రకటలను తొలగించాలని సూచించాం.” అని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!