Minister Anagani: 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు.. ఎంతటి వారున్నా శిక్షిస్తాం: మంత్రి అనగాని
- భూ కబ్జాలపై 8305 ఫిర్యాదులు
- ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం
- ఎంతటి వారున్నా శిక్షిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం అని మంత్రి అనగాని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి 8,305 ఫిర్యాదులు వచ్చాయి. 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్దారించాం. కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో 13 లక్షల 59వేల 505 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు. 25 వేల 276 ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించాం. వీటిలో నిబంధనలకు విరుద్దంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్దారించాం. ఇప్పటి వరకు రెవెన్యూ సంబంధించి 70 వేల ఫిర్యాదులు రాగా.. 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే ఉన్నాయి’ అని మంత్రి అనగాని తెలిపారు.
Also Read
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
Also Read: Nara Lokesh: అప్పటి లోగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం: మంత్రి లోకేశ్
‘భూ కబ్జాల నివారణకోసం నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని తీసుకువస్తున్నాం. భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకువస్తున్నాం. భూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా, పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే కొత్త చట్టం తెస్తున్నాం. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారు, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయి. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం’ అని మంత్రి అనగాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!