Uttarakhand Tunnel Collapse: 170 గంటలుగా సొరంగంలోనే 41 మంది.. మల్టీవిటమిన్, యాంటీ డిప్రెషన్ మాత్రలు..
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సొరంగంలో 170 గంటలుగా కార్మికులు చిక్కుకుపోయి ఉండటం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన పెరుగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ ముందు నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యంత్రాలను రప్పించి డ్రిల్లింగ్ చేశారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో కొండ పై నుంచి నిలువుగా రంధ్రం చేసి కార్మికులను వెలికి తీసుకురావాలని ఆపరేషన్ మొదలుపెట్టారు.
గత సాయంత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నంచి హై పెర్ఫార్మెన్స్ డ్రిల్లింగ్ మిషన్ని తీసుకువచ్చిన తర్వాత నిలువుగా డ్రిల్లింగ్ ప్రారంభించడానికి ఫ్లాట్ఫారం నిర్మించే పనులు ప్రారంభమయ్యాయి. పీఎంఓ అధికారుల బృందం, ఇతర నిపుణులు 41 మందిని రక్షించేందుకు ఏకకాలంలో 5 ఫ్లాన్స్ ద్వారా పనిచేస్తున్నారు. అన్ని సహకరిస్తే మరో నాలుగైదు రోజుల్లో కార్మికులు రక్షించబడతారని ప్రధానమంత్రి మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్చే అన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పనులను సమీక్షించారు. అయితే కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారు.
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
Read Also: Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?
41 మంది ఏడు రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయి ఉండటంతో వారి ఆరోగ్యానికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. మల్టీ విటమని, యాంటి డిప్రెసెంట్స్ మాత్రలను అందిస్తున్నారు. డ్రైఫ్రైట్స్ కార్మికుల కోసం లోపలకి ఇనుప పైపుల ద్వారా పంపుతున్నారు. లోపల కరెంట్, వెలుతురు ఉంది. టన్నెల్ కూలినప్పుడు విద్యుత్కి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నిర్మాణంలో ఉన్న సొరంగం ప్రతిష్టాత్మక చార్ ధామ్ ప్రాజెక్ట్లో భాగం, ఇది హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వం నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!