Uttarakhand Tunnel Collapse: 170 గంటలుగా సొరంగంలోనే 41 మంది.. మల్టీవిటమిన్, యాంటీ డిప్రెషన్ మాత్రలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సొరంగంలో 170 గంటలుగా కార్మికులు చిక్కుకుపోయి ఉండటం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన పెరుగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ ముందు నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యంత్రాలను రప్పించి డ్రిల్లింగ్ చేశారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో కొండ పై నుంచి నిలువుగా రంధ్రం చేసి కార్మికులను వెలికి తీసుకురావాలని ఆపరేషన్ మొదలుపెట్టారు.
గత సాయంత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నంచి హై పెర్ఫార్మెన్స్ డ్రిల్లింగ్ మిషన్ని తీసుకువచ్చిన తర్వాత నిలువుగా డ్రిల్లింగ్ ప్రారంభించడానికి ఫ్లాట్ఫారం నిర్మించే పనులు ప్రారంభమయ్యాయి. పీఎంఓ అధికారుల బృందం, ఇతర నిపుణులు 41 మందిని రక్షించేందుకు ఏకకాలంలో 5 ఫ్లాన్స్ ద్వారా పనిచేస్తున్నారు. అన్ని సహకరిస్తే మరో నాలుగైదు రోజుల్లో కార్మికులు రక్షించబడతారని ప్రధానమంత్రి మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్చే అన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పనులను సమీక్షించారు. అయితే కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also: Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన మలయాళ నటుడు.. ఏసీనే ప్రాణం తీసిందా?
41 మంది ఏడు రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయి ఉండటంతో వారి ఆరోగ్యానికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. మల్టీ విటమని, యాంటి డిప్రెసెంట్స్ మాత్రలను అందిస్తున్నారు. డ్రైఫ్రైట్స్ కార్మికుల కోసం లోపలకి ఇనుప పైపుల ద్వారా పంపుతున్నారు. లోపల కరెంట్, వెలుతురు ఉంది. టన్నెల్ కూలినప్పుడు విద్యుత్కి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నిర్మాణంలో ఉన్న సొరంగం ప్రతిష్టాత్మక చార్ ధామ్ ప్రాజెక్ట్లో భాగం, ఇది హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వం నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!