Answer Sheet Evaluation: వినూత్న ప్రయోగం.. తమిళనాడులో ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం..
- 'ఏఐ’తో పరీక్షా పత్రాల మూల్యాంకనం..
- తమిళనాడులో వినూత్న ప్రయోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Answer Sheet Evaluation Using AI: పరీక్షల కోసం కష్టపడి చదివి రాసేవారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువయ్యారని చెప్పవచ్చు. చాలామంది విద్యార్థులు పరీక్షల్లో ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారని థీమాతో పరీక్షలు రాసేస్తున్నారు. ఇకపోతే పరీక్షా సమాధాన పత్రాలను దిద్దేవారు కూడా అన్ని పేపర్లలో ఇలాంటి వాటిని గుర్తించడం కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి వాటికి తమిళనాడులో కృతిమ మేధస్సు (AI)తో చెక్ పెట్టబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఈ ప్రయోగం ఇప్పటికే మొదలైంది కూడా. పరీక్ష జవాబు పత్రాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో దిద్దించే ప్రయోగాన్ని తమిళనాడు ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు యూనివర్సిటీల పరిధిలో ప్రయోగాలు నడుస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం లోపల ఈ విధానంపై నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు.
Telangana Medical Colleges: ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఈ సాంకేతిక పనితీరును ఉపయోగించుకోవడం కోసం అందులో ఉన్న లోపాలను సవరించి మెరుగైన తీరుతో పని తీరు వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీలలో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ పర్యవేక్షిస్తోంది. ఈ విధానంలో మొదట స్కాన్ చేసిన జవాబు పత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అనుసంధానం ఇస్తారు. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ జవాబు పత్రాన్ని పరిశీలించి తప్పుడు సమాధానం, అలాగే మళ్ళీ మళ్ళీ రాసిన విషయాన్ని ఇలాగే పట్టేస్తోంది. ఆ విషయాన్ని వెంటనే సంబంధిత ఎగ్జామినర్ కు తెలుపుతుంది.
IND vs BAN: చూసుకుందాం.. టీమిండియాకు బంగ్లాదేశ్ యువ పేసర్ వార్నింగ్!
ఇకపోతే అందరూ ఒక రకంగా సమాధానం రాయరు.. ఒక్కో విద్యార్థి ఒక్కోరకంగా చేతిరాత తీరుగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అర్థం కావాలంటే మరింత సమయం పడుతుంది. దానికోసం మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలలో ఈ విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు. కేవలం ప్రొఫెసర్లకు సహాయం గాని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల సమాధాన పత్రంలోని లోపాలను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ మరింతగా సాగుతోంది. మొత్తానికి భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సామర్ధ్యాన్ని పెంచి పరీక్ష పత్రం మూల్యాంకనంలో కీలకంగా ఉపయోగించేలా అభివృద్ధి చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ కార్యదర్శి తెలిపారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..