Answer Sheet Evaluation: వినూత్న ప్రయోగం.. తమిళనాడులో ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం..
- 'ఏఐ’తో పరీక్షా పత్రాల మూల్యాంకనం..
- తమిళనాడులో వినూత్న ప్రయోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Answer Sheet Evaluation Using AI: పరీక్షల కోసం కష్టపడి చదివి రాసేవారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువయ్యారని చెప్పవచ్చు. చాలామంది విద్యార్థులు పరీక్షల్లో ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారని థీమాతో పరీక్షలు రాసేస్తున్నారు. ఇకపోతే పరీక్షా సమాధాన పత్రాలను దిద్దేవారు కూడా అన్ని పేపర్లలో ఇలాంటి వాటిని గుర్తించడం కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి వాటికి తమిళనాడులో కృతిమ మేధస్సు (AI)తో చెక్ పెట్టబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఈ ప్రయోగం ఇప్పటికే మొదలైంది కూడా. పరీక్ష జవాబు పత్రాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో దిద్దించే ప్రయోగాన్ని తమిళనాడు ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు యూనివర్సిటీల పరిధిలో ప్రయోగాలు నడుస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం లోపల ఈ విధానంపై నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు.
Telangana Medical Colleges: ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ సాంకేతిక పనితీరును ఉపయోగించుకోవడం కోసం అందులో ఉన్న లోపాలను సవరించి మెరుగైన తీరుతో పని తీరు వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీలలో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ పర్యవేక్షిస్తోంది. ఈ విధానంలో మొదట స్కాన్ చేసిన జవాబు పత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అనుసంధానం ఇస్తారు. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ జవాబు పత్రాన్ని పరిశీలించి తప్పుడు సమాధానం, అలాగే మళ్ళీ మళ్ళీ రాసిన విషయాన్ని ఇలాగే పట్టేస్తోంది. ఆ విషయాన్ని వెంటనే సంబంధిత ఎగ్జామినర్ కు తెలుపుతుంది.
IND vs BAN: చూసుకుందాం.. టీమిండియాకు బంగ్లాదేశ్ యువ పేసర్ వార్నింగ్!
ఇకపోతే అందరూ ఒక రకంగా సమాధానం రాయరు.. ఒక్కో విద్యార్థి ఒక్కోరకంగా చేతిరాత తీరుగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అర్థం కావాలంటే మరింత సమయం పడుతుంది. దానికోసం మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలలో ఈ విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు. కేవలం ప్రొఫెసర్లకు సహాయం గాని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల సమాధాన పత్రంలోని లోపాలను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ మరింతగా సాగుతోంది. మొత్తానికి భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సామర్ధ్యాన్ని పెంచి పరీక్ష పత్రం మూల్యాంకనంలో కీలకంగా ఉపయోగించేలా అభివృద్ధి చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ కార్యదర్శి తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!