ANR Award: ఏఎన్ఆర్ అవార్డ్ అందుకున్న వరుణ్ సందేశ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావని ప్రముఖ సినీ నటుడు ఎం. మురళీ మోహన్ అన్నారు. ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో, శనివారం జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ ఛాంబర్ లో జరిగిన అక్కినేని శత జయంతి, అక్కినేని యువ హీరోగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “అక్కినేని యువ ఎక్సలెన్సు అవార్డు” ను ప్రముఖ యువహీరో హీరో వరుణ్ సందేశ్ కు మురళీ మోహన్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీ మోహన్ వరుణ్ సందేశ్ కు అవార్డు ప్రదానం చేసారు.
Heritage foods: హెరిటేజ్కు కాసుల పంట.. 5 రోజుల్లో సంపాదన ఎంతంటే..!
Also Read
80 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అక్కినేని ఎన్నో అపురూపమైన పాత్రలు వేసి తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు అయ్యారన్నారు.. కేవలం ఆయన కోసమే సృష్టించిన పాత్రలు ఎన్నో వున్నాయి అంటూ ప్రస్తావించారు. దేవదాస్ పాత్రను చేసిన ఇతర భాషా నటులు కూడా ఆయన నటనకు నీరాజనాలు పలికిన విషయాన్నీ ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి కూడా అంటూ ప్రశంసించారు. సభను ప్రారంభించిన తెలంగాణ కాంగ్రెస్ కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. అక్కినేని తన నటనతో ఎందరికో ఆరాధ్యుడు అయ్యారన్నారు.. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఎన్నో అత్యున్నత పురస్కారాల తో గౌరవించింది అన్నారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ లాంటి యువ నటున్ని గుర్తించి సత్కరించడం సంతోషకరం అన్నారు.
Hyderabad: లిబర్టీ చౌరస్తాలో పాము కలకలం.. భారీగా ట్రాఫిక్ జామ్..
ఈ సందర్బంగా.. ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ., అక్కినేని ఒక యువ హీరో గా సినీ రంగ ప్రవేశ దినం రోజున వరుణ్ సందేశ్ లాంటి ఒక యువ హీరోకు అక్కినేని యువ పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషంగా వుందన్నారు.. అవార్డులను రూపకల్పన చేయడంలో ఆకృతి విశేషమైన అనుభవం వుందన్నారు.. ఇక ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న నిర్మాతల మండలి కార్య దర్శి ప్రసన్నకుమార్ ప్రసంగిస్తూ అక్కినేని, ఎన్టీర్ ఇద్దరు తెలుగు పరిశ్రమను అత్యున్నస్థాయిలో నిలబెట్టిన మహానటులు అంటూ ఆయన ప్రశంసించారు. వరుణ్ సందేశ్ ప్రతి స్పందన తెలియజేస్తు.., ఈ అవార్డ్ ను ఒక మహానటుడి ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయత్రి డా. కె వి కృష్ణ కుమారి, జూబ్లీహిల్స్ వాసవి క్లబ్ స్థాపక అధ్యక్షుడు కొత్త వేంకటేశ్వర రావు, సినీ దర్శకుడు రాజేష్ పాల్గొన్నారు. అక్కినేని, వరుణ్ సందేశ్ అభిమానులు ఈ కార్య క్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!