Heritage foods: హెరిటేజ్కు కాసుల పంట.. 5 రోజుల్లో సంపాదన ఎంతంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్కు కాసుల పంట మొదలైంది. మునుపెన్నడూ లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. శుక్రవారం ఆల్టైమ్ రికార్డు లాభాలను అర్జించింది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక సీట్లను సొంతం చేసుకోవడమే కాకుండా.. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్గా నిలిచారు. దీంతో స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్కు కొత్త ఊపు తీసుకొచ్చింది.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?

ఎన్నికల ఫలితాలకు ముందు జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 దగ్గర ట్రేడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయింది. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ.535 కోట్లు, కుమారుడు లోకేష్ రూ.237 కోట్లు సంపాదించారు. ఐదు రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం పెరిగాయి. హెరిటేజ్ ఫుడ్స్లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, కుమారుడు లోకేష్కు 10.82 శాతం, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. మనవడు దేవాన్ష్కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది. జూన్ 7న ఎన్ఎస్ఈలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి రూ.661.25 దగ్గర ముగిసింది.

హెరిటేజ్ ఫుడ్స్ను 1992లో చంద్రబాబు స్థాపించారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పబ్లిక్-లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా హెరిటేజ్ కంపెనీ అభివర్ణించింది. హెరిటేజ్ సంస్థకు రెండు వ్యాపార విభాగాలు ఉన్నాయి. డెయిరీ మరియు పునరుత్పాదక శక్తి. ప్రస్తుతం హెరిటేజ్ నుంచి పాలు,పాల ఉత్పత్తులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ల్లో హెరిటేజ్ ఫుడ్స్ అమ్ముడవుతున్నాయి.
జూన్ 4న వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విక్టరీని సొంతం చేసుకుంది. టీడీపీ పోటీ చేసిన 17 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకుంది. ఇక ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపులో కీలకపాత్ర పోషించింది. అలాగే మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు కింగ్ మేకర్గా నిలిచారు. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయే 293 స్థానాలను గెలుచుకుంది. గత రెండు పర్యాయాల్లో చక్కని మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వ.. తాజా ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కు కంటే 240 సీట్లు మాత్రమే సాధించింది.
- Tags
- 5 days
- Heritage Foods
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!