Heritage foods: హెరిటేజ్కు కాసుల పంట.. 5 రోజుల్లో సంపాదన ఎంతంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్కు కాసుల పంట మొదలైంది. మునుపెన్నడూ లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. శుక్రవారం ఆల్టైమ్ రికార్డు లాభాలను అర్జించింది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక సీట్లను సొంతం చేసుకోవడమే కాకుండా.. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్గా నిలిచారు. దీంతో స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్కు కొత్త ఊపు తీసుకొచ్చింది.
Also Read
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!

ఎన్నికల ఫలితాలకు ముందు జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 దగ్గర ట్రేడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయింది. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ.535 కోట్లు, కుమారుడు లోకేష్ రూ.237 కోట్లు సంపాదించారు. ఐదు రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం పెరిగాయి. హెరిటేజ్ ఫుడ్స్లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, కుమారుడు లోకేష్కు 10.82 శాతం, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. మనవడు దేవాన్ష్కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది. జూన్ 7న ఎన్ఎస్ఈలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి రూ.661.25 దగ్గర ముగిసింది.

హెరిటేజ్ ఫుడ్స్ను 1992లో చంద్రబాబు స్థాపించారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పబ్లిక్-లిస్టెడ్ కంపెనీల్లో ఒకటిగా హెరిటేజ్ కంపెనీ అభివర్ణించింది. హెరిటేజ్ సంస్థకు రెండు వ్యాపార విభాగాలు ఉన్నాయి. డెయిరీ మరియు పునరుత్పాదక శక్తి. ప్రస్తుతం హెరిటేజ్ నుంచి పాలు,పాల ఉత్పత్తులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ల్లో హెరిటేజ్ ఫుడ్స్ అమ్ముడవుతున్నాయి.
జూన్ 4న వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విక్టరీని సొంతం చేసుకుంది. టీడీపీ పోటీ చేసిన 17 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకుంది. ఇక ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపులో కీలకపాత్ర పోషించింది. అలాగే మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు కింగ్ మేకర్గా నిలిచారు. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయే 293 స్థానాలను గెలుచుకుంది. గత రెండు పర్యాయాల్లో చక్కని మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వ.. తాజా ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కు కంటే 240 సీట్లు మాత్రమే సాధించింది.
- Tags
- 5 days
- Heritage Foods
తాజావార్తలు
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..