Andhrapradesh: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 23 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్లైన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కలగనుంది. కార్డ్ ప్రైం అప్లికేషన్ ద్వారా వినియోగదారులు తమ దస్తావేజులు తామే స్వయంగా రూపొందించుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ప్రభుత్వం కల్పించనుంది. అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యంతో పాటు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం త్వరలో రానుంది. ఈ-సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్కు మరింత భద్రత చేకూరనుంది. ఎటువంటి అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు వంటి పనులు వేగంగా జరగనున్నాయి. ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల నిర్మూలన కూడా సాధ్యం కానుంది.
Also Read: AP Education: ఏపీ విద్యా సంస్కరణలు భేష్.. నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసలు
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఈ-స్టాంపింగ్ తో వేగవంతం కానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. స్టాంపులు కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడతారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (SHCL) బ్రాంచ్ లు, స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) ఈ స్టాంపింగ్ సేవలు లభిస్తాయి.రాష్ట్రవ్యాప్తంగా 2500 సెంటర్ల ద్వారా ఈ- స్టాంపుల విక్రయం చేపట్టారు.
గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు..
దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో సైతం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు కల్పిస్తున్నారు. తొలి విడతగా 1680 గ్రామ/వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్ గ్రేడ్ చేశారు. త్వరలో మిగిలిన గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా సేవలను విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వస్తాయి. ముఖ్యంగా స్టాంప్ విక్రయ సేవలు, ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్), సీసీ, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Minister Usha Sri Charan: చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్
అపోహలు వద్దు – దుష్ప్రచారాలను నమ్మవద్దు…
రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 మేరకు పూర్తి స్థాయి చట్ట భద్రత ఉంటుందని సర్కారు వెల్లడించింది. అందుబాటులోకి రానున్న డిజిటల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఫిజికల్ డాక్యుమెంట్ తో సమానంగా డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్ కు గుర్తింపు ఇస్తున్నారు. ఈ-సైన్ ద్వారా మరింత భద్రత ఉంటుంది. ఆన్లైన్లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఇస్తున్నారు. దీంతో ఆన్లైన్ వెరిఫికేషన్తో నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టినట్లే. బ్యాంకులు ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో వెరిఫై చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. నూతన విధానంలో అత్యంత సెక్యూరిటీ ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందించబడుతుంది. నూతన విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్లు అనేది పూర్తి ‘అవాస్తవం’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ ‘వాస్తవం’ అని వెల్లడించింది. నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది పూర్తి అవాస్తవమని తెలిపింది. ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్నవారికి ఈ స్టాంప్పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ చేసి ఇస్తారు. “స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల” కు సూచనలు, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంచారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?