Andhrapradesh: ఏపీ విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై విద్యుత్ జేఏసీ – యాజమాన్యాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. విద్యుత్ ఉద్యోగుల రివైజ్డ్ పే స్కేళ్లను యాజమాన్యం ఖరారు చేసింది. సింగిల్ మాస్టర్ స్కేల్తో కూడిన పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సంతకాలు చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం 2022 ఏప్రిల్ 1 తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమల్లోకి రానుంది.12 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. పే స్కేళ్లలోని లోటుపాట్లను సరిచేసేందుకు ట్రాన్స్ కో జేఎండీ నేతృత్వంలో మూడు డిస్కమ్ల సీఎండీలతో కమిటీని ఏర్పాటైంది. కొత్తగా అమల్లోకి రానున్న సింగల్ మాస్టర్ స్కేలుతో కూడిన పీఆర్సీ ఒప్పందంపై ఏపీజెన్కో, ఏపీట్రాన్స్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్పీఈజేఏసీ) ప్రతినిధులు, పలు యూనియన్ల నాయకులు సంతకాలు చేసి పరస్పరం ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. పెరిగిన పీఆర్సీతో 28 వేలకి పైగా ఉద్యోగులకి లబ్ధి చేకూరనుంది.
Read Also: Srisailam: తిరుమల చిన్నారిపై చిరుత దాడి ఘటన.. శ్రీశైల దేవస్థానం అలర్ట్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
మొత్తం 12 డిమాండ్లలో 9 డిమాండ్లు ప్రభుత్వం సానుకూలం చేసిందని విద్యుత్ జేఏసీ ఛైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. మిగిలిన 3 డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించి త్వరలో నిర్ణయిస్తామని అధికారులు చెప్పారన్నారు. పీఆర్సీ ఫిట్మెంట్ 8 శాతం అనేది కొత్త విధానమని.. కొత్త విధానాలకు ఉద్యోగులు అలవాటుపడాలన్నారు. పాత విధానంలో పీఆర్సీ ఫిట్మెంట్ రాలేదని ఆలోచించవద్దన్నారు. ప్రభుత్వంతో సహకరించి పని చేసుకోవాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. అగ్రిమెంట్ చేసి.. మిగిలిన మూడు డిమాండ్లు త్వరలో ఇవ్వాలని కోరామన్నారు.
ఆగస్టు 9 తేదీ తరవాత నాలుగు విడతలుగా ఉద్యోగుల జేఏసీ, యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. మాస్టర్ స్కేల్, ఫిట్మెంట్, పీఆర్సీ , జేఎల్ఎం గ్రేడ్ 2, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై విద్యుత్ ఉద్యోగుల చర్చలు జరిగాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను 2018 రివైజెడ్ పే స్కేల్ ప్రకారం సవరిస్తూ ఈ నెల 14న ట్రాన్స్ కో ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!