Pawan Kalyan: మిస్సైన యువతిని ఇంటికి రప్పించిన డిప్యూటీ సీఎం
- మిస్సైన యువతిని ఇంటికి రప్పించిన డిప్యూటీ సీఎం
- భీమవరంలో తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును కనిపెట్టిన ఏపీ పోలీసులు
- కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం
- తమ కూతురు ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అయిన భీమవరంలో తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి ఏపీ పోలీసులు రుజువుచేశారాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ వారిని అభినందించారు. ఇక వివరాలలోకి వెళ్లినట్టు అయితే భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. గతంలో చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ, మీరే ఎలాగైనా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట గుండెలవిసేలా విలపించారు. ఆ తల్లి బాదకు చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాచవరం సీఐతోనూ, విజయవాడ పోలీస్ కమిషనర్తోనూ ఫోన్లో మాట్లాడారు. కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన ఏపీ పోలీసులు ఆ యువతి ఆచూకిని కునుగొనేందుకు విశ్వా ప్రయత్నాలు చేసారు. చివరకు జమ్మూలో ఉన్నట్లు ఆమె జాడను పోలీసులు కనిపెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం జమ్ము వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతం అయ్యింది.
Also Read: Pawan Kalyan: ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్.. మత్స్యకారుల ఇబ్బందులపై ఆరా
Also Read
బాలికను తీసుకువస్తున్న విషయాన్ని ముందుగా విజయవాడ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షలో ఉండగా తెలిపారు. సమీక్ష మధ్యలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి ఆచూకీ కనుగొన్న పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేశారు. ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ద చేయవద్దని ఈ సందర్భంగా కోరారు. ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయాలన్నారు. వాటిపై పోలీసులు తక్షణం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మరోసారి పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ కూతురు ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఈ రోజు ఆ అమ్మాయిని తన తల్లి తండ్రులకి అప్పగించనున్నారు. గతంలో అనేక సభల్లో ఏపీలో 35వేల మందికిపైగా యువతులు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకు ఈ కేసు బలం చేకూర్చినట్లయిందని అంటున్నారు జనసేన పార్టీ నేతలు. గతంలో ఎన్నిసార్లు ఈ అంశంపై ప్రసంగించినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?