Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కొలంబియాలో ఆంధ్రా యువకుడు బేతపూడి సుధీర్ కుమార్ మృతి చెందాడు. జి.కొండూరు నుంచి వెళ్లి ప్రభుత్వ స్కాలర్షిప్తో స్పెయిన్లో సుధీర్ కుమార్ అలియాస్ జోషి ఉన్నత చదువులు పూర్తి చేశారు. 10రోజుల క్రితం జి.కొండూరు నుంచి స్పెయిన్ వెళ్తున్నానని చెప్పి సుధీర్ అక్కడికి వెళ్లిపోయారు. తర్వాత సోదరి జ్యోత్స్నకు ఫోన్ చేసి స్నేహితురాలు జెస్సికా పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నానని, సర్ ప్రైజ్ ఇస్తున్నానని సుధీర్ చెప్పినట్లు తెలిసింది. స్నేహితురాలు జెస్సికా పుట్టినరోజుకు కొలంబియా వెళ్లిన సుధీర్ కానరాని లోకాలకు వెళ్లిపోయినట్లు మృతుడి సోదరి వెల్లడించారు.
Also Read: Heavy Rains: నాగ్పూర్లో భారీ వర్షం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
మృతుడి సోదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా సుధీర్, జెస్సికా లివింగ్ రిలేషన్ షిప్లో ఉన్నారు. వారిద్దరి మధ్య గత మూడు నెలలుగా మనస్పర్థలు ఉన్నాయని సుధీర్ సోదరి తెలిపింది. ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని 5రోజుల క్రితం ఫోన్ చేసి సుధీర్ సోదరి జ్యోత్స్నకు జెస్సికా చెప్పింది. చనిపోయే ముందు ఇండియాలో తన సోదరుడితో సుధీర్ మాట్లాడుతున్న వీడియో జ్యోత్స్నకు జెస్సికా పంపింది. అనంతరం సుధీర్ చనిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యా?హత్యా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుధీర్ మృతి చెంది 5రోజులు అవుతోంది. మృతి చెంది 5రోజులు గడుస్తున్నా కుటుంబసభ్యులకు చివరి చూపుకు ప్రయత్నాలు ఫలించలేదు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కూడా ఆర్థిక స్ధోమత లేదంటూ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుని కడచూపు కల్పించాలని కుటుంబసభ్యులు అభ్యర్థిస్తున్నారు. శోక సంద్రంలో మునిగిన కుటుంబసభ్యులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!