Minister Ambati Rambabu: అంబటి రాంబాబుపై దాడికి యత్నం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఖమ్మంలో అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే రూ. 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు.. ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ కు, ఈ దాడికి మధ్య సంబంధం ఉందేమో అన్న అనుమానం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక నిశ్చితార్థం కోసం నిన్న ఖమ్మం వెళ్లాను.. వరుసగా రెండు సంఘటనలు జరిగాయి.. ఇవాళ ఉదయం నేను బస చేసిన హోటల్ దగ్గర కొంత మంది నాపై దౌర్జన్యం చేశారు.. టీడీపీగా చెప్పుకుంటున్న కొంత మంది కర్రలతో వచ్చారు.. నేను వ్యక్తిగత కార్యక్రమంపై వెళ్లాను.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.. ఏయ్.. అంబటి రాంబాబు నిన్ను వేసేస్తాం అని అరిచారు అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన చూసి తాను ఆశ్చర్య పోయాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ఏడాది కూడా ఒక సామాజిక వర్గ సమావేశంలో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు, ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సంఘటనలో కొంతమందిని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు అని తెలిపారు.. అయితే, ఏమిటి ఈ కులోన్మాదం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాను నడిరోడ్డు పై హత్య చేశారని గుర్తుచేశారు.
Also Read
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
- India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
ఇక, చంద్రబాబు తప్పు చేయబట్టే ఊచలు లెక్క పెడుతున్నారన్నారు అంబటి రాంబాబు.. దాడులతో నన్ను బెదిరించ లేరన్న ఆయన.. కులోన్మాదానికి రోజులు పోయాయన్నారు. నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ కు, ఈ దాడికి మధ్య సంబంధం ఉందేమో అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. నా వాహనంపై లారీ మీద నుంచి రెండు బస్తాలు పడ్డాయి అని రాత్రి జరిగిన ప్రమాదంపై వివరాలు వెల్లడించారు. ఇక, ఖమ్మం పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేశారని తెలిపారు. అంటే ఘాటుగా మాట్లాడితే లేపేస్తారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!